Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్తో రచ్చ.. లైవ్కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్పై రోహిత్ వివరణ!!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో రోల్లో కనిపించనున్న అల్లు అర్జున్: తండ్రి, అన్నను కాదని కొత్తగా ప్లానింగ్
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు అల్లు అర్జున్. బడా ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా.. తనలోని టాలెంట్ను నిరూపించుకుని సక్సెస్ అయ్యాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అల్లు వారి అబ్బాయి.. నిర్మాతగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దానికి సంబంధించిన ఓ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
అల్లు అర్జున్ తండ్రి అరవింద్కు గీతా ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ఉన్న విషయం తెలిసిందే. సోదరుడు అల్లు బాబీ కూడా ఇటీవలే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్లిద్దరూ ప్రొడ్యూసర్లుగా ఉన్నా సరే బన్నీ కూడా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని ఎంతో మందిని చిత్ర సీమకు పరిచయం చేసేందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నాడని అంటున్నారు. అంతేకాదు, బన్నీ తీసే సినిమాలన్నీ ఆహా వీడియోలోనే విడుదల అవుతాయని తెలిసింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్తో ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుండగా, మరికొందరు ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, ఈ సినిమాలో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్గా కనిపించనున్నాడు. అందుకోసం ఈ సినిమా షూటింగ్ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుపుతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్పాట్కు సంబంధించిన లుక్ కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.