Don't Miss!
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- News నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ ! కీలక నేత గుడ్ బై..
- Finance IPO News: నేడే ప్రారంభమైన ఐపీవో.. గ్రేమార్కెట్లో దుమ్ము దులిపేస్తోంది.. బెట్ట్ వేస్తున్నారా..
- Sports హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత అతనే భారత్ కెప్టెన్- హర్భజన్
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
మరో రోల్లో కనిపించనున్న అల్లు అర్జున్: తండ్రి, అన్నను కాదని కొత్తగా ప్లానింగ్
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు అల్లు అర్జున్. బడా ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా.. తనలోని టాలెంట్ను నిరూపించుకుని సక్సెస్ అయ్యాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అల్లు వారి అబ్బాయి.. నిర్మాతగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దానికి సంబంధించిన ఓ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
అల్లు అర్జున్ తండ్రి అరవింద్కు గీతా ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ఉన్న విషయం తెలిసిందే. సోదరుడు అల్లు బాబీ కూడా ఇటీవలే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్లిద్దరూ ప్రొడ్యూసర్లుగా ఉన్నా సరే బన్నీ కూడా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని ఎంతో మందిని చిత్ర సీమకు పరిచయం చేసేందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నాడని అంటున్నారు. అంతేకాదు, బన్నీ తీసే సినిమాలన్నీ ఆహా వీడియోలోనే విడుదల అవుతాయని తెలిసింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్తో ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుండగా, మరికొందరు ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, ఈ సినిమాలో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్గా కనిపించనున్నాడు. అందుకోసం ఈ సినిమా షూటింగ్ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుపుతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్పాట్కు సంబంధించిన లుక్ కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.