మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నారేంటి?.. గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ‘క్రాక్’ టీం
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోవా షెడ్యూల్ కూడా పూర్తయిందని తెలిపాడు. మూడు రోజుల క్రితం గోవాకు వెళ్తున్నట్టు చెప్పిన మాస్ మాహారాజా కాసేపటి క్రితం గోవా షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిందనితెలిపాడు. అసలే ఆది చివరి షెడ్యూల్ అని కూడా చెప్పేశాడు. ఈ షెడ్యూల్లో హీరోయిన్ శ్రుతీ హాసన్తో రవితేజ బాగానే చిల్ అయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరూ బీచ్లో బాగానే సందడి చేసినట్టు కనిపిస్తోంది.
నిన్న సాయంత్ర షూటింగ్ ప్యాకప్ చెప్పే సమయంలో రవితేజ ఓ వీడియోను షేర్ చేశాడు. శ్రుతీ హాసన్ మరో వీడియోను షేర్ చేసింది. రవితేజ షేర్ చేసిన వీడియోలో.. లాస్ట్ షాట్ ఆఫ్ ది డే అంటూ షూటింగ్కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఇక శ్రుతీ హాసన్లో బీచ్లో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేసింది. అయితే ఈ షెడ్యూల్ ఈ ఇద్దరి మీద మంచి రొమాంటిక్ పాటనుషూట్ చేసినట్టు తెలుస్తోంది.

రాజ సుందరం కొరియోగ్రఫీలో రవితేజ, శ్రుతీ హాసన్లపై గోవా బీచ్లు, వీధుల్లో సాంగ్ షూట్ చేశారు. మూడు రోజుల పాటు సాగిన షూటింగ్ నేడు పూర్తైనట్టు రవితేజ తెలిపాడు. షూటింగ్ సరదాగా
సాగినట్టు తెలిపాడు. మొత్తానికి క్రాక్ టీం మాత్రం ఫుల్ స్పీడ్లో ఉంది. సంక్రాంతి బరిలోకి క్రాక్ను దింపేలా ఉన్నారు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











