Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya: 154లు పోస్టర్లతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్.. ఆ రాష్ట్రంలో ఊర మాస్ క్రేజ్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఈ సినిమా విడుదలవుతోందన్న మూడు రోజుల్లో ఫ్యాన్స్ లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో మెగాస్టార్ చిరంజీవి తప్పకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ తో షేక్ చేయబోతున్నాడు అని అర్థమవుతోంది. ఇక టాక్ ఎలా ఉన్నా కూడా మెగాస్టార్ యాక్టింగ్ అలాగే రవితేజ మాస్ ఇమేజ్ సినిమాలో అద్భుతంగా సెట్ అయింది అని అంటున్నారు.
సినిమా తప్పకుండా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ చాలా హడావిడిగా కనిపిస్తున్నారు. అయితే విడుదలకు ఒక రోజు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కూడా ధియేటర్ల వద్ద హంగామా స్టార్ట్ చేశారు. అయితే కర్ణాటకలో కూడా మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉన్నట్లు చాలాసార్లు అర్థమైంది. అయితే ఈసారి వాల్తేరు వీరయ్య సినిమా సందర్భంగా కర్ణాటకలో మెగా ఫాన్స్ చేసిన సందడి కూడా చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది.
Karnataka Mega Fans Huge Rally with 154 Autos. #WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th #Bangalore #karnatka #MegaStarChiranjeevi pic.twitter.com/d89mn7x7Pq
— Pavanheartkiller (@Pavanheartkill1) January 12, 2023
బెంగళూరులోని మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఏకంగా 54 ఆటోల ద్వారా పోస్టర్లతో ర్యాలీ నిర్వహించడం వైరల్ గా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా మెగాస్టార్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నట్లుగా అర్థమయింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా బాబీ దర్శకత్వం వహించాడు.

ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దేవిశ్రీప్రసాద్ అదరగొట్టేశాడు అని అంటున్నారు. సంక్రాంతి పండుగ రోజు కూడా ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.