Don't Miss!
- News
ధన్ కీ బాత్ కాదంటూ కేంద్రంపై కేసీఆర్ ఫైర్: బీఆర్ఎస్లోకి మాజీ సీఎం గమాంగ్, కీలక నేతలు
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
పవన్ కొత్త సినిమా నుంచి షాకింగ్ అప్డేట్: ఒక్కటి కూడా లేకపోతే వర్కౌట్ అవుతుందా!
సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సినిమా ప్రారంభం అవడానికి ముందే పలు చిత్రాలను ప్రకటించాడాయన. దీంతో ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ మధ్య ప్రకటించిన ఓ సినిమాను అన్నింటి కంటే ముందే మొదలు పెట్టాడు. అదే.. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మల్టీస్టారర్గా వచ్చి మలయాళంలో సూపర్ డూపర్ హిట్గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్గా వస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క పాట కూడా ఉండదట. ఎంతో సీరియస్గా సాగే ఎంటర్టైనర్గా దీన్ని రూపొందిస్తున్నారని ఓ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమస్ సంగీతం సమకూర్చుతున్నప్పటికీ.. అది కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్కు మాత్రమేనని అంటున్నారు. ఇద్దరు హీరోలు కావడంతో.. రెండు డిఫరెంట్ బీజీఎమ్స్ రెడీ చేస్తున్నాడట ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఇక, ఈ సినిమాకు మాటల మాంత్రికుడు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో సముద్రఖని కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేశారు.