Pawan Kalyan ఆసక్తికర ట్వీట్.. "శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది" అంటూ!
ప్రస్తుతానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలతో మరో పక్క సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న ట్వీట్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరినీ ఉద్దేశించకుండా ఆయన చేస్తున్న ట్వీట్లు కొందరికి పరోక్షంగా తగులుతున్నాయి అని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది ఆ వివరాల్లోకి వెళితే

రెండు పనులను బ్యాలెన్స్ చేస్తూ
వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన భీమ్లా నాయక్ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. కలెక్షన్ల విషయంలో కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తాయి కానీ ఆ సినిమా అయితే మంచి టాక్ తెచ్చుకుంది. ఆ సంగతి పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్గానే ఉంటున్నారు.

వరుస సినిమాలతో
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి కాగా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మరికొద్దిరోజుల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలు కాకుండా ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా ఒప్పుకున్నారు. ఇక ఇది కాకుండా బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఓ సినిమా చేస్తానని ఆయన మాట ఇచ్చారు.

మరో ఆసక్తికరమైన ట్వీట్
అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన ఈ మధ్య అడపాదడపా తన సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కొన్ని ట్వీట్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. అవి ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు దగ్గరగా ఉండడంతో ఆయన రాజకీయాలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఉన్న ఓ కొటేషన్ ను పేర్కొన్నారు. శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగినంత మూర్ఖత్వం మనది. అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే" అనే కొటేషన్ ను తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
Recommended Video


ఎవరి గురించి చేశారు?
బీసీ, ఎస్సీలు అధికారంలోకి రావాల్సిన అవశ్యకతపై రామ్ మనోహర్ లోహియా ఆలోచనా విధానాన్ని ప్రతిఫలించేలా రచయిత వాకాడ శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పవన్ ఎందుకు చేశారన్నదే అటు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ కొటేషన్ నచ్చి ఆయన పెట్టారా లేక వ్యాఖ్యల వెను కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది కాలమే నిర్ణయించాలి మరి.


Click it and Unblock the Notifications











