Sai Dharam Tej వచ్చేశాడు.. యాక్సిడెంట్ తరువాత మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా పోస్ట్!

చాలా రోజులుగా సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి జరుగుతున్న ప్రచారాన్ని స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వివరాల్లోకి వెళితే

అప్పటికప్పుడు అపోలోకి

అప్పటికప్పుడు అపోలోకి

గత నెల మొదట్లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ మీద వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఆయన గచ్చిబౌలి వెళ్తున్న క్రమంలో కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత కోహినూర్ హోటల్ దగ్గర రోడ్డు మీద ఉన్న ఇసుకను ఎక్కించి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అపోలో ఆస్పత్రికి తరలించడంతో చాలా రోజుల నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు..

పవన్ మాటలతో టెన్షన్

పవన్ మాటలతో టెన్షన్

ఆయన కాలర్ బోన్ డిస్ లొకేట్ కావడంతో హుటాహుటిన ఆయనకు అపోలో వైద్యులు ఆ సర్జరీ కూడా నిర్వహించారు. అయితే కొన్ని రోజుల పాటు వరుసగా సాయిధరమ్ తేజ్ హెల్త్ అప్ డేట్స్ అలాగే బులిటెన్స్ విడుదల చేస్తూ వచ్చిన యాజమాన్యం తర్వాత పూర్తిగా సాయి ధరమ్ తేజ్ అప్ డేట్స్ ఇవ్వడం మానేసింది.. ఆ తర్వాత మెగా కుటుంబానికి చెందిన వారే అడపాదడపా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయం మీద స్పందిస్తూ వచ్చారు.. కొద్ది రోజుల క్రితం జరిగిన సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ కలకలం రేగింది.

సాయి సేఫ్ అన్న దేవా కట్టా

అయితే అదేమీ లేదని సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ సినిమా చేసిన దేవా కట్టా తర్వాత ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ఆయన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వీక్షించాడని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రమోషన్స్ ఎందుకు రావడం లేదు అనే విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం బయట ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉన్న కారణంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతోనే ఆయనను దూరంగా ఉంచుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని ఆయన పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తాడని పేర్కొన్నారు.

థాంక్స్ అనేది చిన్న మాట

థాంక్స్ అనేది చిన్న మాట


ఇప్పుడు తాజాగా సాయి ధరమ్ తేజ్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. రిపబ్లిక్ సినిమా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ థాంక్స్ అనే మాట చెప్పి సరి పెట్టలేనని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నాడు. థాంక్స్ అనే మాట చాలా చిన్న విషయం అయిపోతుందని త్వరలో మీ ముందుకు వస్తాను అంటూ థమ్సప్ సింబల్ పెట్టి ఇప్పుడు అంతా ఓకే అన్నట్టు సంకేతాలు ఇచ్చారు.

Recommended Video

Sai Pallavi Heartfelt Speech About Nagarjuna In Love Story Success Meet
ప్రసంశల వర్షం

ప్రసంశల వర్షం

ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఊహించినంత మేర కలెక్షన్లు రావడం లేదు కానీ టాక్ మాత్రం సినిమాకు బాగానే వచ్చింది. చాలా మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ సెలబ్రిటీలు సైతం సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ కూడా సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X