Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సయీ మంజ్రేకర్తో అల్లు అర్జున్ రొమాన్స్: అదిరిపోయే ప్లాన్ వేసిన బడా డైరెక్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్తో సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ను అందుకున్న అతడు.. ప్రస్తుతం సుకుమార్తో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లి అడవుల్లో జరుగుతోంది.
'పుష్ప' మూవీ పట్టాలపై ఉండగానే అల్లు అర్జున్.. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. యువసుధ బ్యానర్, GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్తో రూపొందనుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. అదే సమయంలో బన్నీ కూడా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నాడు. ఈ రెండూ పూర్తయిన వెంటనే వీళ్లిద్దరి కాంబో పట్టాలెక్కనుంది. అంటే 2021 ద్వితియార్థంలో ఇది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక, 2022లో ఈ మూవీ రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే సినిమాకు హిందీ భామ సయీ మంజ్రేకర్ను తీసుకున్నారట. ఇప్పటికే ఆమె ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని తెలిసింది. సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సహా పలు హిందీ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. విలక్షణ నటుడు అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మేజర్' ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అది విడుదల కాకముందే బన్నీ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.