Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో సినిమాను లైన్ లో పెట్టిన సుధీర్ బాబు.. సీనియర్ నటుడి దర్శకత్వంలో..
విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సుధీర్ బాబు నెక్స్ట్ కూడా చాలా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. గత ఏడాది నానితో చేసిన V సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా హిట్టవ్వలేదు. ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం సుధీర్ 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మొదటి సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక మరోవైపు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
అదే విధంగా మరొక కొత్త ప్రాజెక్ట్ ను కూడా లైన్ లో పెడుతున్నట్లు సమాచారం. నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మనం, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలకు డైలాగ్స్ అందించిన హర్షవర్ధన్ ఆ మధ్య శ్రీముఖితో ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా ఎటు తేలకుండానే కనుమరుగయ్యింది. ఇక ఇప్పుడు సుధీర్ బాబుకు కొత్త స్టోరీ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. మరి సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.