Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అతడు ఇంకా నా హృదయంలోనే.. మరిచిపోలేకపోతున్నా.. అనుష్క ఎమోషనల్
పక్కవాడిని పట్టించుకొనే రోజులు పోయాయనే మాటల వినిపిస్తున్న రోజుల్లో.. తనకు దూరమైన ఓ వ్యక్తి గురించి అందాల తార అనుష్క శెట్టి తలచుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది. తనకు సహాయకుడిగా వ్యవహరించిన రవి అనే యువకుడిని తలచుకొని విషాదంలో మునిగిపోయింది. తన ఇన్స్టాగ్రామ్లో హృదయానికి హత్తుకొనే పోస్టుతో పెట్టిన అనుష్కను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రవి గురించి అనుష్క పెట్టిన మెసేజ్ గురించి. .
అసిస్టెంట్ రవిని తలచుకొని
రవి అనే యువకుడు నాకు సహాయకుడిగా పనిచేశారు. చాలా యుక్త వయసులోనే అతడు మృత్యువు ఒడిలోకి చేరిపోయాడు. ఇప్పటికీ రవి ఎప్పడూ నాకు గుర్తొస్తుంటాడు. ఎలాంటి కపటం ఎరుగని రవి మా మధ్య లేరనే విషయం, బాధ నన్ను వెంటాడుతున్నది. రవి నాకు దూరం కావడం జీవితంలో ఏదో కోల్పోయిన బాధగా అనిపిస్తుంది అని అనుష్క శెట్టి అన్నారు.
నాకు దూరమై 7 ఏళ్లు దాటినా
మనల్ని బాగా ఇష్టపడిన వాళ్లు దూరమైన వారి ఆత్మ మనతోనే ఉంటుంది. మరణం మనకు ఇష్టమైన వారిని దూరం చేయలేదు. రవితో నా అనుబంధం14 ఏళ్లు. నీవు దూరమై 7 ఏళ్లు అయిపోయింది. ఇంకా నా గుండెల్లోనే ఉన్నావు. నిన్ను అమితంగా ఇష్టపడే వాళ్లు నీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కారణం నాకు తెలియదు గానీ.. నా హృదయంలో రవి గూడుకొట్టుకొన్నాడా అనిపిస్తుంది అని అనుష్క ఉద్వేగభరితమైన లేఖను రాశారు.
వరుస చిత్రాలతో అనుష్కశెట్టి
బాహుబలి, భాగమతి చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నది. భాగమతి తర్వాత కొంత గ్యాప్ తీసుకొన్నారు. శారీరకంగా, మానసికంగా సంసిద్ధమైన ఈ జేజమ్మ మళ్లీ ఇప్పుడు కెరీర్పై దృష్టిపెట్టారు. పెళ్లి, అఫైర్ రూమర్లను ఎదురించిన ఈ బ్యూటీ మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారుతున్నారు. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తున్నది.
సెలెన్స్, సైరా నర్సింహరెడ్డి మూవీస్లో
ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి, సైలెన్స్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సైరాలో చిరంజీవితో మరోసారి ఓ కీలకపాత్రతో జతకడుతున్నారు. అలాగే కోన వెంకట్ రూపొందించే సైలెన్స్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుంది. థ్రిల్లర్గా రూపొందే ఈ చిత్రంలో అంజలి, ఆర్ మాధవన్, హాలీవుడ్ నటుడు, కిల్ బిల్ స్టార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.