Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్.. గుర్తుపట్టని విధంగా షాకింగ్ గ్లామర్ డోస్!
కొంతమంది హీరోయిన్స్ దురదృష్టం ఏమిటో గాని మొదట్లో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తరువాత ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కనిపించకుండా మాయమైపోతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో కొత్త బంగారులోకం హీరోయిన్ కూడా ఉంది. శ్వేతా బసు ప్రసాద్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే అసలు గుర్తుపట్టని విధంగా మారిపోయింది. గ్లామర్ డోస్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో కెరీర్ అలా..
బీహార్ లో జన్మించిన శ్వేతా బసు ప్రసాద్ 2002 సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక ఈ బ్యూటీ చిన్నతనంలోనే కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆమె కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా కూడా వర్క్ చేసింది. ఇక మొదట్లోనే కమర్షియల్ యాడ్స్ ద్వారా గుర్తింపు అందుకొని పలు దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా..
శ్వేతా బసు ప్రసాద్ 2002లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక హిందీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఇక తర్వాత 2005లో ఆమె ఇక్బాల్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తన అసలు కెరీర్ ను మొదలు పెట్టింది. ఇక అనంతరం వరుసగా కొన్ని హిందీ సినిమాలలో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ బెంగాలీ భాషలో కూడా కొన్ని సినిమాలు చేసింది.

బిగ్గెస్ట్ హిట్ మూవీ
ఇక శ్వేతా బసు ప్రసాద్ మొదటగా 2008లో కొత్త బంగారులోకం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా అప్పట్లో ఆమెకు బిగ్గెస్ట్ హిట్.
ఇక ఆ సినిమా తర్వాత ఈ భామకు గ్యాప్ లేకుండా తెలుగులో చాలా మంచి అవకాశాలు వచ్చాయి. కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు అనే ఇలా కొన్ని డిఫరెంట్ లవ్ స్టోరీలు చేసినప్పటికీ అవి ఏమీ అంతగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి.

చేదు అనుభవాలు.. బ్రేకప్స్
అయితే సినిమాలు సక్సెస్ అవుతున్నా లేకపోయినా కూడా 2017 వరకు కూడా ఈ బ్యూటీ హిందీ బెంగాలీ తమిళ్ తెలుగు భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కానీ మధ్యలో ఆమె కొన్ని చేదు అనుభవాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో కూడా ఆమె బ్రేకప్ చెప్పింది. ఆ ప్రేమ వ్యవహారాల వలన ఆమె కొన్నాళ్లు డిప్రెషన్ లోకి కూడా వెళ్లినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

గుర్తుపట్టని విధంగా..
అయితే శ్వేతా బసు ప్రసాద్ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో మరొక ఫోటోను పోస్ట్ చేయగా అది ఊహించిన విధంగా వైరల్ గా మారుతోంది. అందులో అమ్మడు తన టాప్ అందాలను చాలా అందంగా ప్రజెంట్ చేసినప్పటికీ మొహం మాత్రం గుర్తుపట్టని విధంగా మారిపోయింది అని ఓ వర్గం నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆమె ఇంకా నటిగా ఇండస్ట్రీలో ఉండాలని ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తోంది. మరి శ్వేతా బసు మళ్ళీ తెలుగులో ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











