Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్రీదేవిని చూసిన ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్
2018లో ఇండియన్ సినీ రంగంలో చోటు చేసుకున్న అతిపెద్ద విషాదాల్లో ఒకటి ప్రముఖ నటి శ్రీదేవి మరణం. ఆమె చివరగా రవి ఉద్యవర్ దర్శకత్వంలో వచ్చిన 'మామ్' చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమనటిగా జాతీయ అవార్డు దక్కింది. అయితే అవార్డు అందుకోవడానికి ముందే ఆమె చనిపోయిన సంగతి తెలిసిందే.
ఇటీవల విడుదలైన 'జీరో' చిత్రంలో శ్రీదేవి అతిథి పాత్రలో కనిపించారు. ఆమె మరణించడానికి ముందే ఆ సీన్లు షూట్ చేయడంతో మరోసారి వెండితెరపై అతిలోక సుందరిని చూసే అవకాశం దక్కింది. 'జీరో'లో శ్రీదేవి కనిపించడంతో చాలా మంది ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి కనిపించే చివరి చిత్రం కూడా ఇదే.
Aw! To see her for the last time onscreen😕Almost entire theatre sighed in sadness together when she appeared for those few mins on screen ..😑 #SriDevi #Zero#ZeroFamilyEntertainer #ZeroReview @iamsrk pic.twitter.com/iqw9D8nSQS
— #SahadKaAangan 🔥 (@DemotionalMansi) December 23, 2018
'జీరో' చిత్రం చూసిన అనంతరం పలువురు అభిమానులు ట్విట్టర్ ద్వారా శ్రీదేవిని మిస్సవుతున్నట్లు వెల్లడిస్తూ ట్వీట్స్ చేశారు. ఇకపై ఆమెను తెరపై చూడలేమనే విషయాన్ని ఇప్పటికీ కొందరు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
#Sridevi ma'am in #Zero She looked beyond beautiful to my expectation. Like an Angel ....can't take of my eyes on her. #SrideviLivesForever pic.twitter.com/QvxtXHCoWz
— Neha kashyapa (@neha0130) December 23, 2018
ఆనంద్ ఎల్ రాజ్ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మాతగా రెడ్ చిలీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన 'జీరో' చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటించాడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీసు వద్ద జీరో చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది.