Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విచ్చలవిడిగా లవ్ లెటర్స్.. ఓ లెటర్లో అది చూడగానే భయపడిపోయా: హీరోయిన్
''కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా.. నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా'' అంటూ టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త లోకాన్ని పరిచయం చేసింది హీరోయిన్ రేఖ. 'ఆనందం' సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించింది. అయితే ఆ తర్వాతి కాలంలో వెండితెరకు దూరమైన ఆమె తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూ రూపంలో ప్రేక్షకులను పలకరించింది.
ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కన్నడలో తాను 'చిత్ర' సినిమా చేశానని, హీరోయిన్గా తనకదే మొదటి సినిమా అని చెప్పింది రేఖ. అందులో తన గ్లామర్ చూసి ప్రేక్షకులు ఫిదా కావడం తనను చాలా సంతోష పెట్టిందని చెప్పింది. తాను తెరపై కనిపించగానే కొంతమంది అభిమానులు చిల్లర డబ్బులు తెరపైకి చల్లేవారని తెలిసి చాలా ఆనంద పడ్డానని రేఖ చెప్పుకొచ్చింది.
ఆ సినిమా తర్వాత అభిమానుల నుంచి లవ్ లెటర్స్ వచ్చేవని, ఓ అభిమాని ఏకంగా రక్తంతో లవ్ లెటర్ రాయడంతో చాలా భయపడ్డానని చెప్పింది రేఖ. ఆ సినిమా సక్సెస్, అలా వచ్చిన గుర్తింపును తాను ఎప్పటికీ మరిచిపోలేనని ఆనందం వ్యక్తం చేసింది హీరోయిన్ రేఖ. అలాగే కొన్నేళ్ల క్రితం తాను చనిపోయినట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్న రేఖ.. బతికుండగానే శ్రద్ధాంజలి ఫొటో చూసుకునే ఛాన్స్ ఎవరికి వస్తుంది చెప్పండి అంటూ సరదాగా స్పందించింది.