నాకా ఫోబియా ఉంది.. చాలా పెద్ద విషయం అది.. టెన్షన్ రేపిన రత్తాలు!
తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయిన లక్ష్మీ రాయ్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్గా కనిపించిన ఈ అమ్మడు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ డోస్ పెంచేసింది. అయితే తాజాగా ఈ భామ తన ఫోబియా గురించి చెబుతూ ఆసక్తికర పోస్ట్ పెట్ట్టింది. ఆ వివరాల్లోకి వెళితే

కాంచనమాల కేబుల్ టీవీ
తెలుగులో మంచి అవకాశాలు రాకపోవడంతో ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి స్కిన్ షో చేస్తూ మంచి హాట్ బాంబ్ లా మారిపోయింది. నిజానికి లక్ష్మీ రాయ్ గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పేరు మార్చుకుని రాయ్ లక్ష్మిగా మారింది. శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాయ్ లక్ష్మి మొదటి సినిమాలో చాలా పద్దతైన పాత్రలో నటించింది.

ఐటెం భామగా బిజీ
అయినా ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత మరో సినిమా చేసి బాలీవుడ్ మీద మనసు పడింది. అక్కడ కూడా ఆమెకు కాలం కలిసి రాలేదు. ఇక దీంతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ కుర్ర కారు చేత మాస్ స్టెప్స్ వేయించేలా ఐటెం భామ గా మారిపోయింది. సెక్సీ లుక్స్తో వెండితెరకు అందం తీసుకురావడంలో రాయ్ లక్ష్మిది అందె వేసిన చేయి.

కష్టపడుతున్నా
అయితే ఎంత కష్టపడుతున్నా అడపాడదపా ఐటెమ్ సాంగ్లు, లేదా చిన్న చిన్న గ్లామర్ పాత్రలు తప్ప పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు. అయినా సరే ఎలాగో కెరీర్ని లాక్కుంటూ వస్తున్నా ఈ భామ ఇక లాభం లేదని మ్యారేజ్ చేసుకుని కొత్త లైఫ్ మొదలు పెట్టాలని నిర్ణయించుకుని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న ఈ భామ పెళ్లి డేట్ కూడా కూడా ఫిక్స్ చేసుకున్నానని వెల్లడించింది.

వ్యాక్సిన్ వేయించుకోవడానికి తిప్పలు
ఇక ఈ భామ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ఆసక్తికరంగా మారాయి. నిజానికి ఆమె వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళింది. కానీ ఆమెకో ఫోబియా ఉండటంతో అక్కడ ఉన్న నర్స్ లను, డాక్టర్లను చూసి కాసేపు వణికిపోయింది. అంతేకాక ఈ విషయాన్ని ఆమె వీడియో కూడా తీసి తన ఫాలోవర్స్ తో పంచుకుంది.

ట్రిపనో ఫోబియా
తనకు నిజంగా ట్రిపనో ఫోబియా(సూది అంటేనే భయం) ఉందని ఆమె పేర్కొంది. ఇంజెక్షన్ తీసుకోడం నాకు పెద్ద విషయం కానీ నేను ఎట్టకేలకు ఆ పని చేశాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాను వ్యాక్సినేషన్ చేయించుకున్న వీడియోని రాయ్ లక్ష్మి షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆమె రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా చేస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











