Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బాలీవుడ్ లో వివక్ష నిజమే - శ్రుతీ హాసన్
బాలీవుడ్ లో బంధుప్రీతి, మూవీ మాఫియా అంశాలపై ఎడతెగని చర్చ నడుస్తున్న నేపథ్యంలో క్రమంగా అందరూ తమ ఆలోచనలతో పాటూ తమకు ఎదురైన చేదు అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ కమల్ హాసన్ తనయ శ్రుతీహాసన్ కూడా బాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న పరిస్థితులపై పెదవి విప్పింది.
లాక్ డౌన్ సమయంలో తన సంగీత కళకు మరింత పదును పెట్టిన శ్రుతి, ఓ పాటను కంపోజ్ చేసి విడుదల చేసేందుకూ సిద్దమయింది. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించిన శ్రుతి, ఇటీవలే ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలపై తన ఆలోచనలు కూడా పంచుకుంది. రెహ్మాన్ కు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా అతడిని భారతీయుడిగానే చూస్తారు తప్ప, దక్షిణాది మనిషా, ఉత్తరాది మనిషా అని చూడరని స్పష్టం చేసింది. కానీ, భారత్ లోనే ఈ ప్రాంతీయ వివక్ష ఎక్కవగా ఉందని వెల్లడించింది.
తాను తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంటే, హిందీలో గ్యాప్ వస్తుందని, ఆ మాత్రానికే జనాలు సినిమాల్లో నటించడం మానేశావా అని అడుగుతారని తెలిపింది. బాలీవుడ్ లో నటించకపోతే, ఇక తాము నటించడం మానేసినట్లేనే, తాము నటులం కానేట్టేనా అని సూటిగా ప్రశ్నిస్తోంది. దక్షిణాదికి చెందిన తమ పట్ల వివక్ష ఉందని స్పష్టం చేసింది. కానీ, ఇవన్నీ తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవని, తన మూలాల పట్ల తనకు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయని వెల్లడించింది. కానీ, పరిశ్రమలో ఉన్న అంతర్గత వివక్షకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని నొక్కి వక్కాణించింది.