Don't Miss!
- News
Vastu tips: ఇంటికెళితే చిరాకులా.. అన్నీ సమస్యలా.. బయటపడేందుకు చెయ్యాల్సిందిదే!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Shaakuntalam: కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. డైరెక్టర్ అన్న మాటతో ఎమోషనల్.. ఓపిక లేదంటూ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే యశోద సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు మరో లేడి ఒరియెంటెండ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ప్రముఖ తెలుగు దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో కీలక పాత్ర దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా అల్లు అర్హ నిలవనుంది. అయితే మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత బయటకు రావట్లేదు. తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్ సందర్భంగా బయటకొచ్చిన సామ్ కన్నీళ్లు పెట్టుకుంది.

మయోసిటీస్ వ్యాధితో..
కొంతకాలంగా మయోసిటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్న సామ్ చాలాకాలంగా హైదరాబాద్ లోని ఇంట్లోనే ఉంటుంది. మీడియా ముందుకు కూడా రావట్లేదు. ఇటీవలే ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన సామ్ తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించి అందరిని పలకరించింది. ఈ సందర్భంగా శాకుంతలం సినిమా గురించి.. తనకు ఓపిక లేకున్నా ఈ ఈవెంట్ కు ఎందుకు వచ్చిందో పలు విషయాలను పంచుకుంది సామ్.

ప్రతి సినిమా ప్రాణం పెట్టి...
"ట్రైలర్ కు మీరు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను ఓపిక లేకున్నా శక్తి తెచ్చుకుని ఎలాగైనా ఇక్కడికి రావాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను. గుణ శేఖర్ గారిపై ఉన్న రెస్పెక్ట్, అభిమానం వల్ల వచ్చాను. కొంతమందికి వాళ్ల జీవితంలో సినిమా అనేది భాగమే. కానీ గుణ శేఖర్ గారికి సినిమానే ఆయన జీవితం. ప్రతి సినిమా ప్రాణం పెట్టి తీస్తారు. అలాగే ఈ శాకుంతలం కూడా అలాగే తీశారు. ఈ ట్రైలర్ తర్వాత మీరు ఇచ్చే ప్రశంసలు చూడాలనే వచ్చాను. అది చాలా ముఖ్యం" అని సమంత తెలిపింది.

పాదాలపై పడి థ్యాంక్స్..
"సినిమా నేరేషన్ విన్నప్పుడూ ఊహించనట్లే రావాలని యాక్టర్స్ అందరూ కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు మాత్రమే మా ఊహను దాటి ఏదో ఒక ఎక్స్ ట్రా మ్యాజిక్ జరుగుతుంది. శాకుంతలం సినిమా చూశాకా అదే నేను ఫీల్ అయ్యాను. ఇది నేను ఊహించినదానికంటే ఎన్నో రెట్లు బాగుంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. గుణ శేఖర్ గారి పాదాలపై పడి థ్యాంక్యూ చెప్పాను. థ్యాంక్యూ సో మచ్" అని సామ్ పేర్కొంది.
|
ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు..
"దిల్ రాజు గారికి చాలా థ్యాంక్యూ. సినిమాను నమ్మి.. శాకుంతలం అనే మ్యాజికల్ ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి ఎలాంటి లిమిట్స్ లేకుండా, క్యాలిక్యులేషన్స్ లేకుండా నమ్మకం, ఒక ప్యాషన్ తో చేయాలి. అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ని దిల్ రాజుగారిలో చూశాను. ఈ సినిమాలో చాలా పెద్ద సీనియర్ నటీనటులు ఉన్నారు. వాళ్లందరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థ్యాంక్యూ చెప్పుకుంటాను" అని సమంత చెప్పుకొచ్చింది.

మారనిది ఒక్కటే..
"నేను సెట్ లోకి అడుగు పెట్టగానే అక్కడున్న అమ్మాయిల రియాక్షన్ చూసి పర్ఫెక్ట్ దుష్యంతుడు దొరికాడని ఫిక్స్ అయ్యాను. కాళిదాసు గారు ఐదో శతాబ్ధంలో రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చెసుకున్న ఈ సినిమా కోసం నన్ను గుణ శేఖర్ గారు ఎంపిక చేయడం నా అదృష్టం. నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అయితే మారనిది ఒక్కటే ఉంది. అదే సినిమాను నేను ఎంత ప్రేమిస్తాను. సినిమా నన్ను ఎంత ప్రేమిస్తుందనే విషయం. శాకుంతలం సినిమాతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నాను" అని సామ్ తెలిపింది.
|
కన్నీళ్లతో సామ్..
శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా డైరెక్టర్ గుణ శేఖర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగా సామ్ ఎంతగానో ఎమోషనల్ అయింది. ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశంసించారు గుణ శేఖర్. దీంతో సమంత ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. చాలా సంతోషంగా ఉన్న సామ్ ఓవైపు నవ్వుతూనే మరోవైపు కన్నీళ్లను తుడుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఎపిక్ మైథాలాజికల్ తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఫ్రిబవరి 17న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.