Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
భూకంప పీడిత 'హైతీ'ని దర్శించి తన ఔదార్యాన్ని చాటిన తార..!!
ప్రముఖ హాలీవుడ్ తార ఏంజలీనా జోలీ భూకంపంతో అతలాకుతలం అయిన హైతీ దేశాన్ని సందర్శించారు. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆమె ఇటీవలే హైతీ దేశ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ పరిసరాల్లోని నిరాశ్రయులను పరామర్శించారు. అక్కడ వారి రక్షణకై తీసుకుంటున్న చర్యలు, పిల్లల పోషనకై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో కూడా ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ పర్యటనలో ఆమె ఇతర దేశాల నుండీ హైతీకి వచ్చి ఉచితంగా సేవలు అందిస్తోన్న డాక్టర్లను కలుసుకొని వారిని అభినందించారు. అక్కడి డాక్టర్ల సేవలకు ఉడుతాభక్తి సాయంగా ఆమె మిలియన్ డాలర్లను విరాళంగా అందజేసి తన ఔదార్యాన్ని మరోసారి చాటిచెప్పింది. కాగా జోలీ ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ ఇంతకు ముందు ఇరాక్, థాయ్ ల్యాండ్, పాకిస్తాన్ లాంటి దేశాలను సందర్శించారు. ఎంతో బిజీగా వుంటూ కూడా ఆమె చేస్తున్న సేవలకు అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.