Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కెన్నడీ భార్య సీక్రెట్ ఆడియో టేపులు త్వరలో బహిర్గతం
లండన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సతీమణి జాక్వెలిన్ కీలక సంభాషణలు గల ఆడియో టేపులను బహిర్గతం చేయనున్నారు. 1963 నవంబర్ 22న కెన్నెడీ హత్య జరిగిన కొద్ది నెలల తర్వాత రికార్డు చేసిన ఆ టేపులను త్వరలో ఓ టీవీ చానల్ ద్వారా ప్రజల ముందుంచనున్నారు. తాను చనిపోయిన 50 ఏళ్ల తర్వాత వాటిని బయటపెట్టాలని జాక్వెలిన్ పేర్కొనడంతో బోస్టన్లోని కెన్నెడీ లైబ్రరీలో ఇప్పటిదాకా టేపులను దాచిఉంచారు. 1994 మేలో ఆమె కాన్సర్ వ్యాధితో మరణించింది.
కాగా, త్వరలో ఆ టేపులను ఏబీసీ చానల్ ద్వారా బహిర్గతం చేయడానికి జాక్వెలిన్ కూతురు కరోలిన్ కెన్నెడీ అంగీకరించారని 'సండే ఎక్స్ప్రెస్" పేర్కొంది. కెన్నెడీతో జాక్వెలిన్ ఆంతరంగిక జీవితం గురించిన ఆసక్తికర విషయాలు వాటిలో ఉంటాయని భావిస్తున్నారు. ఆ టేపులను రెండు గంటల నిడివిగల కార్యక్రమంలో ప్రసారం చేస్తామని చానల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, టేపుల్లో ఏముందో అన్న అంశంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి.