Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
శీలాన్ని వేలం వేసిన భామకు ఇండియాలో నో ఎంట్రీ
గతంలో హైతీలో భూకంప బాధితులకు సహాయం చేయడానికి తన శీలాన్ని వేలం వేస్తున్నట్టు ప్రకటించిన హాలీవుడ్ వివాదాల రాణి లిండ్సే లోహన్ ను భారతదేశంలో పర్యటించకుండా నిషేధించాలని భారతీయ ఇమిగ్రేషన్ అధికారులు యోచిస్తున్నారు. గత డిసెంబరులో పర్యాటక వీసా మీద భారత్ విచ్చేసిన లిండ్సే లోహన్ బిబిసి సంస్థ వారు మనుషుల అక్రమ రవాణా మీద నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రీకరణలో పాల్గొంది. అంతటితో ఆగకుండా తాను భారతదేశ వీసా నిబంధనలను ఉల్లంఘించానని, పర్యాటక వీసా మీద వచ్చి మిగతా పనుల కోసం దేశంలో తిరిగినట్టు, ఈ పనిలో భాగంగా తను 40 మంది పిల్లలను కాపాడినట్టు ఆవిడ గారు ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ఎక్కడపడితే అక్కడ ప్రచారం చేసుకుంటోంది.
దీంతో ఒళ్లు మండిన ఇమిగ్రేషన్ వారు ఆమె పేరును బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని యోచిస్తున్నారట. ఇక ఆమె 40 మంది పిల్లలను రక్షించినట్టు అసత్య ప్రచారాలు చేసుకుంటోందని..ఆమె రాకముందే వారిని రక్షించామని భారత్ లోని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.