Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డ్రగ్స్ తీసుకోని జైలులో గడపడం వల్లనే అమెను జడ్జిగా తీసుకోలేదు...
హాలీవుడ్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పోందినటువంటి రియాలిటీ షో ద ఎక్స్ ప్యాక్టర్. గతంలో ఈ ద ఎక్స్ ప్యాక్టర్ టాలెంట్ షోకి జడ్జిగా వ్యవహారించినటువంటి సైమన్ కోవెల్ కొ్న్ని అనివార్యకారణాలు వల్లే లిండ్సే లోహాన్ని తీసుకోవడానికి నిరాకరించడం జరిగిందని తెలిసింది. కాగా ఇప్పుడు ఆటాలెంట్ షోకి జడ్జి ప్యానెల్లో డ్రగ్స్ తీసుకోని మొన్నటివరకు రిహాబ్లో గడిపినటువంటి ట్రబుల్డ్ స్టార్ లిండ్సే లోహాన్ అవకాశాలు ఉన్నాయంటూ రూమర్స్ వెలువడడం జరిగింది.
కానీ ఈరూమర్స్ అనేవి నిజం కావని శనివారం రాడర్ ఆన్ లైన్.కామ్ వెబ్ సైట్ ఓనర్ ధామ్సన్ వివరించడం జరిగింది. కాగా మంచి ఆదరణ ఉన్నటువంటి ఈషోలో ఇటీవలే జైలులో గడిపివచ్చినటువంటి డ్రగ్స్ తార లిండ్సే లోహాన్ని జడ్జిగా తీసుకోవడం వల్ల ప్రేక్షకుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే లిండ్సే లోహాన్ ఈషోకి తీసుకోవడం లేదన్నారు.
లిండ్సే లోహాన్ని జడ్జిగా తీసుకోకపోవడానికి చాలా కారణాలున్నాయని జడ్జి ప్యానెల్లో ఉన్నటువంటి సైమన్ కోవెల్ వివరించారు. లిండ్సే లోహాన్ ని తీసుకుంటే ప్రజలు ఎలా స్పందిస్తారనే ఉద్దేశ్యంతోనే అలా చేయడం జరిగిందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రేటింగ్స్ దృష్టిలో పెట్టుకోని మరీ ఈనిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.