Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డబ్బు కట్టలేక హోటల్ నుండీ గెంటివేయబడ్డాడు
ప్రముఖ పాప్ మాంత్రికుడు దివంగత మైఖేల్ జాక్సన్ ప్రపంచాన్నంతటినీ తన పాటలతో ఓ ఊపు ఊపాడు. ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ చివరి రోజుల్లో అత్యంత దయనీయమయిన స్థితిలో బ్రతికాడు. హోటల్లో డబ్బుకట్టలేకపోవడంతో ఆయన్ని తన అనుచరులనీ హోటల్ ఖాళీచేసి వెళ్లాల్సిందిగా ఆదేశించారట. ఈ విషయాన్ని స్వయంగా మైఖేల్ కు, అతని పిల్లలకూ బాడీ గార్డుగా పనిచేసిన బిల్ విట్ ఫీల్డ్ ఎబిసీ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో స్పష్టం చేసాడు.
క్రెడిట్ కార్డు యాక్సెస్ కాకపోవడంతో మమ్మల్ని వెంటనే డబ్బుకట్టి హోటల్ ఖాళీచేసి వెళ్లిపోవాల్సిందిగా హోటల్ యాజమాన్యం హుకుం జారీ చేసింది. కానీ అప్పుడు హోటల్ లో కట్టడానికి డబ్బులేకపోవడంతో బిల్ పే చెయ్యకుండానే ఎన్నో అవమానాలతో హోటల్ నుండీ బయటపడ్డామని.. ఈ ఒక్క ఉదాహరణ చాలు మైఖేల్ జాక్సన్ మరణించడానికి ముందు ఎంత దరిద్రంలో వున్నాడో చెప్పడానికి, ఎన్ని అవమానాల పాలయ్యాడో చెప్పడానికి అని ఆవేదనాపూరిత స్వరంతో అన్నాడు బిల్ విట్ ఫీల్డ్. వీటికి తోడు ఆయన చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. ఈ మానసిక క్షోభతోనే ఆయన ఆరోగ్యం పాడయిందని ఆయన చెప్పాడు. వీటి నుండీ బయటపడటానికే లండన్ లో షో చెయ్యాలను ఏర్పాట్లుచేస్తుండగా ఆయన హఠాత్తుగా మరణించాడని మైఖేల్ ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.