Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అసలు సంగతి పెరుమాళ్లకే ఎరుక..!?
మైఖేల్ జాక్సన్ అనుమానాస్పద మృతి కేసు చిక్కుముడి వీడటంలేదు సరికదా ఇంకా బిగుసుకుంటోంది. రోజుకో కొత్త అనుమానాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మైఖేల్ జాక్సన్ చనిపోయాడని డా ముర్రే నిర్ధారించిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన మైఖేల్ కు ఆసుపత్రిలో కూడా గుండె కొట్టుకుందట. కానీ ముందుగానే మైఖేల్ జాక్సన్ చనిపోయాడని తెలిపి చికిత్సను ఆపేయడే కాకుండా, ఆంబులెన్స్ ను పిలవడంతో అలసత్వం ప్రదర్శించి కావాలనే ఆయన మృతికి కారకుడయిన డా ముర్రేను శిక్షించాలని మైఖేల్ తండ్రి జియో జాక్సన్ కోర్టుకు విన్నవించుకున్నాడు.
ఇదిలా వుంటే ముర్రే మైఖేల్ జాక్సన్ కు CPR చేయడం మధ్యలో ఆపేసి అక్కడున్న మందు సీసాలను ఎవ్వరికీ కనబడకుండా దాచేయాలని ప్రయత్నించడమే కాకుండా ఆంబులెన్స్ ను పిలవడంలో ఆలస్యం చేసాడని పోలీసులకు నివేదించిన మైఖేల్ బాడీ గర్డ్ ను మైఖేల్ కుటుంబ సభ్యులు ఉద్యోగం నుండీ తొలగించారు. మరిందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. అసలు ఈ కేసు చిక్కుముడి ఎప్పుడు వీడనుందో మరి..!?