Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆస్కార్ వేడుకల్లో మార్పు... కారణం అదే!
సినీ రంగంలో అత్యున్నత అవార్డు ఏదైనా ఉందంటే అది ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డును చేతుల్లోకి తీసుకోవానే కల అందరూ కంటారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. ఆస్కార్ అవార్డును గెలవాలని అంరదూ ట్రై చేస్తారు. మన ఇండియన్ సినిమాలు కూడా ఆస్కార్ కోసం బరిలోకి దిగుతాయి. కానీ అక్కడి వరకు చేరలేదు. చివరగా మనకు ఆస్కార్ అవార్డును తీసుకొచ్చిన ఘనత ఏ ఆర్ రెహమాన్కు దక్కుతుంది.
ఒకటి కాదు ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులను ఇండియాకు తీసుకొచ్చి చరిత్ర లిఖించాడు. అయితే ఈ ఆస్కార్ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. లాస్ ఏంజిల్స్లోని డాల్బి థియేటర్లో ఆస్కార్ అవార్డు వేడుకల అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతీ ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం అలా జరగదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది.
సినిమా రంగమంతా మూతపడింది. ఎన్నో చిత్రాలు ఇంకా బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇంకా ఏవైనా చిత్రాలు ఎంట్రీలోకి వస్తాయా? అని చూసేందుకు ఆస్కార్ వేడుకలను వాయిదా వేసి ఏప్రిల్లో జరుపనున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు కరోనా కూడా తగ్గే అవకాశం ఉందని అలా ఫిక్స్ చేశారట. ఇక ఈ 93వ ఆస్కార్ అవార్డుల రేసులోకి మన భారత చిత్రం జల్లికట్టు ఎంట్రీ ఇచ్చింది. మరి చివరకు నిలబడి అవార్డును గెలుస్తుందో లేదో చూడాలి.