Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీడియా కోసం ముద్దులు పెట్టుకున్న జంట..!!
హాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచంలోనే అందమయిన జంటగా పేరుతెచ్చుకున్న ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ విడిపోనున్నారని ఇటీవల అంతర్జాతీయ మీడియా నానా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపడేసారు. కానీ మీడియా మాత్రం వీరిని వదలడం లేదు. ఏదైనా పబ్లిక్ కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఇద్దరూ ఆలోచనలే పడి సీరియస్ గా కనిపిస్తే చాలు ఆ ఫొటో తీసుకుని వీరిద్దరి మధ్య సంబంధం బెడిసికొట్టింది. అందుకే ఇద్దరూ ముభావంగా వున్నారని ఓ వార్తని పుట్టించేస్తోంది.
దీంతో మీడియా వారికి చెక్ పెట్టాలని అనుకున్నారో ఏమో ప్రస్తుతం వెనీస్ లో వుంటున్న ఈ జంట జోలీ తాజాగా నటిస్తున్న ది టూరిస్ట్ సినిమా సెట్ లో అందరి ముందు పెదాలు కలుపుకొని వారి ప్రేమ ఎంత ఘాటైనదో చెప్పకనే చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ జంట జోలీ నటిస్తున్న సినిమా టూరిస్ట్ సినిమా షూటింగ్ వెనీస్ పరిసరాల్లో జరగనుండటంతో వారి ఆరుగురు పిల్లలతో కలసి వెనీస్ కు తరలివెళ్లారు.