Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
హాలీవుడ్ చిత్రంలో ప్రకాష్ రాజ్, డిటేల్స్
విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ త్వరలో 'ఉలవచారు బిర్యానీ' అనే చిత్రం డైరక్ట్ చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తన స్వీయదర్శకత్వంలో ధోనీ చిత్రాన్ని తెరకెక్కించిన నటుడు ప్రకాష్ రాజ్ త్వరలో మరో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షుల ముందుకు రాబోతున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్.
ఆ మధ్య కేరళ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన ఆయన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో వెంటన ఆ చిత్ర నిర్మాతను అప్రోచ్ కావటం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవటం జరిగింది. మళయాలంలో ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని 'ఉలవచారు బిర్యానీ' పేరుతో తెలుగులో రూపొందించబోతున్నారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించటంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...'ఉలవచారు బిర్యానీ' నేను నా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించబోతున్నాను. మళయాలంలో హిట్టయిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెలుతుంది' అని తెలిపారు. మళయాళంలో వచ్చిన 'సాల్ట్ అండ్ పెప్పర్'లో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మరో ముఖ్యపాత్రలో యామీ గౌతం నటించనుంది. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్న ఈ "ఉలవచారు బిర్యానీ" కి ' లవ్ ఈజ్ కుకింగ్ ' అన్న ట్యాగ్ లైన్ తగిలించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రానికి సాహిత్యం సిరివెన్నెల అందించనుండగా సంగీత బాధ్యతలు ఇళయరాజా స్వీకరించారట.