Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మూవీ లెజెండ్ వాల్ట్ డిస్నీ కూతురు మృతి
కాలిఫోర్నియా: హాలీవుడ్ మూవీ లెజెండ్ వాల్ట్ డిస్నీ కూతురు డియానె డిస్నీ మిల్లర్ కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలో ఈ నెల 19న మరణించారు. ఆమె వయసు 79. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డియానె డిస్నీ మిల్లర్ మంగళవారం కన్నుమూసారు. పలు అంతర్జాతీయ పత్రికలు ఈ విషయాన్ని ధృవీకరించాయి.
వాల్డ్ డిస్నీ, ఆయన సతీమణి లిల్లియన్కు డియానె డిస్నీ మిల్లర్ ఏకైక బయాలాజికల్ సంతానం. డియానె సోదరి షారోన్ మాయెని డిస్నీ దంపతులు 1936లో దత్తత తీసుకున్నారు. 20 ఏళ్ల క్రితమే షారోన్ మాయె మరణించారు. తాజాగా డియానె డిస్నీ మిల్లర్ కూడా కన్నుమూయడంతో వాల్డ్ డిస్నీ అభిమానులు విచారంలో మునిగి పోయారు.
డియానె డిస్నీ మిల్లర్....డిస్నీ కంపెనీ మాజీ సీఈఓ రోన్ డబ్లు.మిల్లర్ను పెళ్లాడారు. ప్రస్తుతం డిస్నీ కంపెనీ సీఈఓగా బోగ్ ఐజెర్ కొనసాగుతున్నారు. డియానె మృతిపై ఆయన మాట్లాడుతూ 'డియానె డిస్నీ మిల్లర్ మృతితో మేమంతా విషాదం ఉన్నాం. కంపెనీ ఉద్యోగులంతా ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేసాం' అని తెలిపారు.
డిస్నీ ల్యాండ్ రూపకల్పనలో ఆమె తనవంతు పాత్ర పోషించారు. డిస్నీ కంపెనీకి ఆమె చేసిన సేవలు మరువ లేనివని, డిస్నీ చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచి పోతుందని బోగ్ ఐజెర్ పేర్కొన్నారు.