Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జేమ్స్బాండ్ కు 'ముంబయి' భయం ఎందుకని?
లాస్ ఏంజిలిస్ : జేమ్స్ బాండ్ తాజా చిత్రం 'స్కైఫాల్' ను ముంబయిలో చిత్రీకరించాలనుకున్నా సాధ్యం కాలేదని చిత్ర దర్శకుడు శామ్ మెండిస్ చెప్పారు. జనసాంద్రక కలిగిన మార్కెట్లలో నేరస్తులను వెంటాడే దృశ్యాలు చిత్రీకరించాలనుకున్నా వీలు కాలేదు. మోటార్బైక్లపై వెంటాడే దృశ్యాలు, రైలులో ఏక్షన్ దృశ్యాలు చిత్రీకరించాలనుకున్నప్పటికీ సన్నని ఇరుకు వీధులలో అది సాధ్యం కాదని తేలినట్లు 'హాలీవుడ్ రిపోర్టర్' పత్రిక రాసింది.
'' ముంబయి అతి విస్తృతమైన నగరం. అక్కడ కీలక ప్రదేశాలలో చిత్రీకరించాల్సి ఉంటుంది. కాని అందులో పలు ప్రమాదాలున్నాయని గుర్తించాం. ప్రజలు అడ్డుపడతారని కాదు. ఇరుకు గల్లీలలో చిత్రీకరణ అసాధ్యం. అందువల్ల నిరాశ చెందాను'' అని మెండిస్ ఆ పత్రికకు చెప్పారు. తరువాత దక్షిణాఫ్రికా వెళ్లి కేప్టౌన్, జోహాన్స్బెర్గ్లను పరిశీలించారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని 47 ఏళ్ల డైరెక్టర్ గ్రహించారు. తర్వాత టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వెళ్లి కొంతమేర చిత్రీకరణ జరిపారు.
లేటెస్ట్ జేమ్స్ బాండ్ మూవీ 'స్కైఫాల్' ఇండియన్ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించడమే కాదు...హాలీవుడ్ సినిమాల్లోకెల్లా అత్యధిక వీకెండ్ ఓపెనింగ్స్ సాధించిన రెండో సినిమాగా రికార్డ్ సృష్టించింది. నవంబర్ 1న విడుదలైన ఈ చిత్రం తొలి వీకెండ్(4 రోజులు)లో రూ. 27.5 కోట్లు వసూలు చేసింది. టోటల్ గా ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 34.5 కోట్లు వసూలు చేసింది.సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 1న ఈచిత్రాన్ని 907 ప్రింట్లతో దేశ వ్యాప్తంగా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏ 2డి హాలీవుడ్ సినిమా కూడా ఈ రేంజిలో విడుదల కాలేదు. మొత్తం నాలుగు భాషలు(ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం)ల్లో సినిమా విడుదలైంది.
శామ్ మెండిస్ దర్శకత్వంలో రూపొందిన 'స్కైఫాల్' మూవీ..... బ్రిటన్ గూడచార సంస్థకు చెందిన మాజీ ఏజెంట్ విలన్ గా మారిన వైనాన్ని, సంస్థకు, బ్రిటన్ తలనొప్పిగా ఎలాంటి విధ్వంసానికి పాల్పడ్డాడు, ఏజెంట్ OO7(జేమ్స్ బాండ్) అతని ఆగడాల ఏలా అడ్డుకున్నాడు? అనే స్టోరీతో నడుస్తుంది.బాండ్ సినిమాలు మొదలయి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 23వ చిత్రంగా రూపొందిన 'స్కైఫాల్' చిత్రం నవంబర్ 1న విడుదలైంది. తెలుగులో ఈ చిత్రం 'లోకం చుట్టిన వీరుడు' టైటిల్ తో విడుదలైంది.