Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీనియర్ హీరోయిన్కు అరుదైన వ్యాధి.. సోషల్ మీడియాలో వెల్లడి.. అందుకే రాలేదని..
Recommended Video
కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యా మరోసారి వివాదంలో కూరుకుపోయింది. మాజీ ఎంపీ, సీనియర్ నటుడు అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేయగా, కన్నడలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే తనకు గురువు లాంటి అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడం వెనుక తన అనారోగ్యమే కారణమని పేర్కొన్నారు. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.
స్టార్ హీరోయిన్గా ఎదగడంపై
దివ్య స్పందన అనే అమ్మాయి కన్నడ చిత్ర పరిశ్రమలో రమ్యాగా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. స్టార్గా ఎదుగుతున్న క్రమంలో అంబరీష్ ఆశీర్వాదంతో ఎంపీ అయ్యారు. అలాంటి అంబరీష్ చివరిచూపుకు రాకపోవడంతో అభిమానుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. సోషల్ మీడియాల్లో వస్తున్న పోస్టులను చూసిన రమ్యా తన గైర్హాజరుకు సంబంధించి స్పష్టత ఇచ్చారు.
అంబరీష్ అంత్యక్రియలకు రాకపోవడంపై
కన్నడ ప్రముఖ సినీ నటుడు అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడానికి కారణాన్ని తన సోషల్ మీడియాలో వెల్లడించింది. నా కాలికి అరుదైన వ్యాధి సోకింది. నేను రాకపోవడాన్ని తప్పుపట్టి నిరసన వ్యక్తం చేయవద్దు. అంబరీశ్ అంకుల్ మృతితో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను అని రమ్యా పేర్కొన్నది.
ఔను..! నాపెళ్ళి నిజమే: స్వయంగా ఇలా చెప్పేసింది
అంబరీష్ మరణం కుంగదీసింది
అంబరీష్ అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని పరిస్థితి నన్ను చాలా కుంగ దీసింది. అందుకే అంత్యక్రియలకు రాలేదు. వ్యక్తిగతంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో బాధపడుతున్నాను అని ఎంపీ రమ్యా తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో, సందేశాన్ని పోస్టు చేశారు.
ఆస్టియోకాల్యటోమా అరుదైన వ్యాధితో
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రమ్యా ఆస్టియోకాల్యటోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. కాలులోని మూలగకు సంబంధించిన వ్యాధి అని వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారట. దాంతో అక్టోబర్ నుంచి రమ్యా చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకొంటున్నారు.
పదిలక్షల మందిలో ఒకరికి
ఆస్టియోకాల్యటోమా అనేది అరుదైన వ్యాధి పది లక్షల మందిలో ఒక్కరికి వస్తుందని వైద్యులు వెల్లడించారు. ఎముక ములగుల్లో బాధ విపరీతంగా ఉంటుంది. ఈ వ్యాధితో నడిచేందుకు సాధ్యం కాదు. ఈ వ్యాధికి చికిత్స లేదు, ఆపరేషన్ తప్పదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి వ్యాధికే కి మాజీ ఎంపీ రమ్య గురికావడం గమనార్హం.