Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
ఆ పాత్ర రమ్యకృష్ణకా? ఖుష్బూకా? సంచలన చిత్రం కోసం పోటీ!
విలక్షణ నటుడు ధనుష్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం పా పాండి. 2017లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్ర రీమేక్ హక్కులను తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకొన్నారు. కన్నడలో ఈ చిత్ర రీమేక్కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో ప్రచారమవుతున్నది.
కన్నడలో రాజ కిరణ్ పోషించిన పాత్రలో ప్రముఖ నటుడు అంబరీష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అంబి నినాద్ వయస్సైథో అనే టైటిల్ను పెట్టారు. తొలుత ఈ చిత్రంలో అంబరీష్ సరసన సుహాసిని మణిరత్నం నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. తాజాగా అంబరీష్ సరసన నటించే పాత్ర కోసం రమ్యకృష్ణ, ఖుష్భూ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

పా పాండి చిత్రంలో యంగ్ రాజ్ కిరణ్ పాత్రను ధనుష్ పోషించాడు. కన్నడంలో ధనుష్ పాత్రను కిచ్చ సుదీప్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుదీప్ స్వీయ నిర్మాణ సారథ్యంలో కిచ్చ క్రియేషన్స్లో రూపొందిస్తున్నారు. కన్నడ రీమేక్ కోసం గురుదత్త గనిగా అనే దర్శకుడిని రంగంలోకి దించారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నది.