Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రక్తం మరుగుతుంది.. బలైపోతున్నారు.. నాకు అలాంటి.. లైంగిక వేధింపులపై స్టార్ హీరోయిన్
మలయాళ నటి మంజిమా మోహన్ తమిళ, మలయాళ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. తమిళంలో మొదటి కాలుపెట్టినా మలయాళంలో స్టార్గా మారారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జామ్ జామ్, దేవరాట్టం చిత్రాల్లో నటిస్తున్నది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో లైంగిక వేధింపులపై కొనసాగుతున్న మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

మీటూ ఉద్యమం మంచిదే
సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకోవడం మంచి పరిణామమే. మహిళలకు అభద్రతాభావం తొలగిపోతుంది. కానీ కొందరు దీనిని స్వప్రయోజనాలకు వాడుకొంటున్నారు. పరిశ్రమకు అది మంచి సూచన కాదు అని మంజిమా మోహన్ అన్నారు.

రక్తం మరుగుతున్నదని కామెంట్
లైంగిక వేధింపులకు లోనయ్యామని చాలా మంది హీరోయిన్లు దేశవ్యాప్తంగా ముందుకు వస్తున్నారు. వారికి జరిగిన అన్యాయం చెప్పుకోవడం మంచిదే. కానీ కొందరు చెబుతున్న విషయాలతో రక్తం మరిగిపోతున్నది అని అన్నారు. అలాంటి వాటిని ఖండించాల్సిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కొందరు మాత్రం బలవుతున్నారు..
అయితే కొందరు హీరోయిన్లు, చిన్న పాటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయనే భావన కలుగుతుంది. దాని వల్ల తప్పు చేయని కొందరు బలపోతున్నారు. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీటూ ఉద్యమానికి గౌరవం దక్కుతుంది అని మంజిమా మోహన్ అన్నారు.

నాకు అలాంటి అనుభవం కాలేదు
నా సినీ కెరీర్లో అలాంటి అనుభవాలు నాకు ఎదురు కాలేదు. ఎవరైనా అలాంటి ప్రస్తవన తీసుకువస్తే వెంటనే వాటిపై ఘాటుగా స్పందించే దానిని. నా ముందు ఎంత పెద్దవారున్నా అలాంటి వారిని తీవ్రంగా మందలించేదానిని అని మంజి మోహన్ వెల్లడించారు.

వారిపై లైంగిక ఆరోపణలు రావడం
తమిళ పరిశ్రమలో సినీ రచయిత వైరముత్తు, డైరెక్టర్ సుశీ గణేషన్, నటుడు రాధారవిపై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరం. అలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తేల్చాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నారు. త్వరలో హిందీలో ఘనవిజయం సాధించి క్వీన్ మలయాళ రీమేక్లో నటించనున్నారు.