Don't Miss!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మళ్లీ వివాదంలో మోహన్లాల్.. లీగల్ నోటీసులు జారీ
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ మళ్లీ వివాదంలో ఇరుక్కొన్నారు. గత వారం మలయాళ నటి కిడ్నాప్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ వ్యవహారం కూడా ఆయనను ఇబ్బందుల్లో పెట్టింది. తాజాగా ఓ చేనేత కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో సరికొత్త విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వ్యాపార ప్రకటనలో చరఖాను తిప్పడంపై సామాజిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన నటించిన వ్యాపార ప్రకటన తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆరోపించింది. దాంతో రంగంలోకి దిగిన కేరళ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చర్యలకు ఉపక్రమించడమే కాకుండా నోటీసులు పంపడం వివాదంగా మారింది.
కేరళ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అధ్యక్షురాలు శోభన జార్జి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాపార ప్రకటన ఉందని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో మోహన్లాల్కు, చేనేత కంపెనీకి నోటీసులు పంపించాం. స్వాతంత్ర్య పోరాటానికి చిహ్నమైన చరఖాకు సదరు ప్రకటనకు సంబంధం లేదు అని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాపార ప్రకటనల్లో మోహన్లాల్ నటించకుంటే మంచిదనేది నా సలహా అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, మోహన్లాల్ ప్రస్తుతం కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించే ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఒడియాన్, కయాంకులం, కొచున్ని, నీరాళీ అనే మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు కూడా ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి.