Veera Simha Reddy నుంచి మరో అదిరిపోయే సాంగ్.. శ్రుతి హాసన్ కు 'మాస్ మొగుడు'గా!
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో, గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బాలకృష్ణ అఖండ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ తో అభిమానుల చేత ఉర్రూతలూగించాడు. ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమాకు కూడా తమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇదివరకు వచ్చిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు మరో మాస్ సాంగ్ ను విడుదల చేయనున్నారు వీర సింహా రెడ్డి మేకర్స్.

మరో మాస్ నెంబర్..
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం వీర సింహా రెడ్డి. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు పాటలకు వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. మా బావ మనోభావాలు సాంగ్ అయితే ఇప్పటికే కోటి వ్యూస్ రాగా.. 1.5 లక్షల లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇప్పుడు మరో మాస్ నెంబర్ ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మేకర్స్.
మాస్ మొగుడు అంటూ..
బాలకృష్ణ, శ్రుతీ హాసన్ పై మరో సాంగ్ ను చిత్రీకరించారు. మాస్ మొగుడు అంటూ సాగే ఈ సాంగ్ ను జనవరి 3న అంటే మంగళవారం రాత్రి 7 గంటల 55 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "మాస్ జాతరకు ఇంకాస్తా డోస్ పెంచుతూ ఈ న్యూ ఇయర్ ను ప్రారంభిద్దాం" అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్న వీర సింహా రెడ్డి చిత్రంలో కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ మరో కీలక పాత్రల్లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.

స్పెషల్ గెస్ట్ గా..
అఖండ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవర్ఫుల్ కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ను ఇప్పటికే మొదలు పెట్టగా జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించనున్నారు. గ్రాండ్ గా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరుకానున్నారని ఒక టాక్ వినిపిస్తోంది. దీంతో స్టార్ హీరోలను ఒకే వేదికపై చూసేలా మైత్రీ మూవీ మేకర్స్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి సంక్రాంతి బరిలో తెలుగు నుంచి వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ నిలిచారు.


Click it and Unblock the Notifications











