Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జయ జానకి నాయకలో బీచ్ సాంగ్.. మూడు కోట్లతో భారీ సెట్..
విడుదలకు ముందే జయ జానకి నాయక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు హంగామా చేస్తున్నాయి. ఈ చిత్రం కోసం భారీ రేంజ్లో ఓ పాటను చిత్రీకరించేందుకు సిద్దమవుతున్నారు. మూడు
విడుదలకు ముందే జయ జానకి నాయక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు హంగామా చేస్తున్నాయి. ఈ చిత్రం కోసం భారీ రేంజ్లో ఓ పాటను చిత్రీకరించేందుకు సిద్దమవుతున్నారు. మూడు కోట్ల రూపాయలతో విశాఖపట్నం సమీపంలో భారీ సెట్ను చిత్ర యూనిట్ నిర్మించింది. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రగ్యా జైస్వాల్పై రొమాంటిక్ బీచ్ సాంగ్ను షూట్ చేయనున్నారు.
ఆగస్టు 11న జయ జానకి నాయక
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఆగస్టు 11న రిలీజ్కు సిద్ధమవుతున్నది.
సినిమాకు బెంచ్ మార్క్లా
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ ఈ పాట చిత్రీకరణ గురించి మాట్లాడుతూ.. "ఖర్చుకు వెనుకడుగు వేయకుండా "జయ జానకి నాయక" చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్-గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి అని అన్నారు.
3 కోట్లతో భారీ సెట్
సినిమాను రిచ్గా నిర్మించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి బీచ్ సాంగ్ కోసం వైజాగ్ లో 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ భారీ సెట్ ను నిర్మించాం. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రగ్యాజైస్వాల్ కాంబినేషన్లో ఈ పాటను చిత్రీకరించనున్నాం. ఆగస్ట్ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
తెర వెనుక.. తెర ముందు..
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను