Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అనుష్క...ఆభరణాలకే అయిదు కోట్లు
ఇందు నిమిత్తం హిందీ చిత్రం 'జోథా అక్బర్'కి పనిచేసిన నీతా లుల్లా 'రుద్రమదేవి'కి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్నారు. షూటింగ్ కి నిజమైన బంగారం, వజ్రాభరణాల్ని వినియోగిస్తున్నారు. అందులో భాగంగానే నగల కోసం అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే 35 శాతం చిత్రీకరణ పూర్తయింది.
దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ ''ఇప్పటిదాకా చిత్రీకరించిన సన్నివేశాలని త్రీడీ ఐమ్యాక్స్లో ప్రదర్శించి చూసుకొన్నాం. ఎంతో సంతృప్తినిచ్చాయి. 'జోథా అక్బర్'లో ఐశ్వర్యారాయ్ ధరించిన ఆభరణాలకు ఎంతగా పేరొచ్చిందో అంతకంటే ఎక్కువ పేరు ఇందులోని ఆభరణాలకు వస్తుంది. నీతూ లుల్లా ఆభరణాలని చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతినాయక లక్షణాలుండే హరిహరదేవుడు పాత్రలో సుమన్ నటిస్తున్నారు. డిసెంబరులోపు చిత్రీకరణ పూర్తి చేస్తామ''ని తెలిపారు.
ఈ నెల 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. హైదరాబాద్లో తీర్చిదిద్దిన వేయి స్తంభాల గుడి సెట్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సుమన్ ప్రతినాయకుడిగా నటిస్తారు. కృష్ణంరాజు, ప్రకాష్రాజ్, నథాలియా కౌర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: ఇళయరాజా.