twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం’ చిత్రాన్ని నిలిపేసిన ప్రభుత్వం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివాదాస్పద చిత్రం 'ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం' చిత్రాన్ని నిలిపివేయాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా బ్రాహ్మణ స్త్రీలను కించ పరిచేలా ఉండటంతో బ్రాహ్మణ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, ఇతరత్రా వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    చలం 1937లో రాసిన 'బ్రాహ్మణీకం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాత చెబుతున్నారు. చలం వంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం పేరును అడ్డుపెట్టుకుని, బ్రాహ్మణ స్త్రీలను కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.

    ఈ పరిణామాల నేపథ్యంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రవదన శుక్రవారం రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సినిమాటోగ్రఫీ చట్టం కింద ఈ చిత్ర ప్రదర్శన ను నిలిపివేయాలని కోరారు. ఈ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కాకుండా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ తదితరులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణకు శుక్రవారం వినతిపత్రాన్ని సమర్పించారు.

    అధికారులు కూడా సినిమాపై అభ్యంతరం చెప్పడంతో మంత్రి అరుణ సినిమా విడుదల నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసారు. బ్రాహ్మనిజం చిత్రానికి దర్శకత్వం, నిర్మాత, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, లిరిక్స్ ఇలా అన్ని విభాగాలు జీటీ పూరి అనే ఒకే వ్యక్తి హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    The A. P. Film Television and Theatre Development Corporation Ltd. has written to the Home department to take steps for suspending the release of the controversial film ‘Women in Brahmanism’. Minister for Information and Public Relations D.K.Aruna, directed Corporation Managing Director R. V. Chandravadan to take up the issue with the Special Chief Secretary, Home.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X