Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు.. నా కాపురంలో నిప్పులు పోశారు!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీకి కాల్ డేటా కేసులో చిక్కులు ఎక్కువవుతున్నాయి. తన భార్యపై రహస్య నిఘా పెట్టి ఆమె కాల్ డేటా దొంగిలించిన కేసులో నవాజుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడి లాయర్ రిజ్వాన్ పై కూడా ఈ కేసు నమోదైంది. తాజగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఆకృతి నాగ్ పాల్ రిజ్వాన్ పై సంచలన ఆరోపణలు చేసింది.
రిజ్వాన్ తన కాల్ డేటాని కూడా దొంగిలించారని ఆమె కేసు నమోదుచేయడంతో అతడికి మరింతగా ఉచ్చుబిగుసుకున్నట్లు అయింది. ఆకృతి 2014 లో అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మనస్పర్థల కారణంగా అతడి నుంచి ఆకృతి విడిపోయింది. తన వివాహ జీవితం నాశనం కావడానికి కారణం రిజ్వాన్ అంటూ ఫిర్యాదు చేసింది. తన కాల్ డేటాని దొంగిలించి, అనిల్ కు తనపై లేనిపోని అనుమానాలు కలిగేలా చేసాడని ఆరోపించింది. రిజ్వాన్, అనిల్ ఇద్దరూ స్నేహితులని ఆకృతి పోలీస్ ఫిర్యాదులో తెలిపింది. అనిల్ మరో యువతితో సంబంధం పెట్టుకునేలా రిజ్వాన్ ప్రోత్సహించినట్లు కూడా ఆకృతి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.