Don't Miss!
- News ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్లో వైసీపీ
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సీక్రెట్ గా...: ప్రధానితో ఆమిర్ఖాన్ డిన్నర్!
ముంబై: క్రితం సంవత్సరం అసహనంపై ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మన దేశ ప్రధాని మోదీతో కలిసి శనివారం రాత్రి డిన్నర్ చేశారు. ఈ డిన్నర్లో నటి కంగనా రనౌత్ కూడా పాల్గొన్నట్టు సమాచారం.
ఈ డిన్నర్ లో ..రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు. ముంబయిలో మేకిన్ ఇండియాపై కార్యక్రమం జరిగిన అనంతరం ఈ డిన్నర్ను ఏర్పాటుచేశారు. అత్యంత రహస్యంగా గా జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.
అమీర్ అసహనంపై చేసిన వ్యాఖ్యలను అప్పుడు భాజపా తప్పుపట్టింది. ఇన్ క్రెడిబుల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఆమీర్ఖాన్.. అసహనంపై వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తరువాత జరిగిన పరిణామాలతో ఆమీర్ను ఇన్ క్రెడిబుల్ ఇండియాకు అంబాసిడర్ నుంచికేంద్రపర్యాటకశాఖ తొలగించిన విషయం తెలిసిందే.