Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భూలోకానికి వచ్చిన రంభ ఆర్తి అగర్వాల్
నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో తెరంగ్రేటం చేసి ఆ తర్వాత చాలా సినిమాలు చేసి ఓ రోజు పెళ్ళి చేసుకుని బై చెప్పేసింది ఆర్తి అగర్వాల్. అయితే పెళ్ళి మూన్నాళ్ళ ముచ్చటలా కరిగిపోవటంతో తనను అక్కరకు తీసుకున్న వెండితెరనే ఆశ్రయించి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొన్న పోసాని ప్రక్కన జెంటిల్ మెన్ లో చేసిన ఆమె ఆ తర్వాత నీలవేణి అనే చిత్రంలోనూ బక్కయింది. తాజాగా లక్కీ మీడియా సంస్థ నిర్మిస్తున్న 'బ్రహ్మలోకం టూ యమలోకం' (వయా భూలోకం) చిత్రంలో ఆర్తి నటిస్తోంది. ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చిన రంభగా ఆమె కనిపిస్తుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, శివాజీ, సోనియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బెక్కెం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్ నిర్మాతలు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ''రంభ పాత్ర ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా నా పాత్ర, ఈ సినిమాలోని వినోదం ప్రేక్షకులకు నచ్చుతాయి'' అంటోంది ఆర్తి. ఇదైనా వర్కవుట్ అయి ఆమెకు మరిన్ని ఆఫర్స్ ఇస్తాయని ఆశిద్దాం.