Don't Miss!
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలయ్య...99వ చిత్రం...5 గురు రైటర్స్... 29 నే
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ 98వ చిత్రం 'లయన్' గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ వెంటనే తన 99వ సినిమా సన్నాహాల్లో పడిపోయారు. బాలకృష్ణ కొత్త చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ తెరకెక్కిస్తోంది. ఈ నెల 29న ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు పక్కాగా సిద్ధమైంది. అలాగే ఈ చిత్రానికి ఐదుగురు రైటర్స్ పనిచేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ఇమేజ్కీ, ఆయన శైలికీ సరిగ్గా సరిపోయే కథ ఇదని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. మరోవైపు హీరోయిన్స్ వేట సాగుతోంది. ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీమోహన్, బీవీఎస్ రవి, డైమండ్రత్నం, శ్రీధర్ సీపాన రచనా సహకారం అందించారు. ఐదుగురు రచయితలు ఓ సినిమా కోసం పనిచేయడం గొప్ప విషయమే. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి 'డిక్టేటర్' పేరు పరిశీలనలో ఉంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్ర్రారంభించి దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని హైదరబాద్, ఢిల్లీ, యూరప్ లలో కంటిన్యూగా షూట్ చేయనున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతారని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. గతంలో బాలకృష్ణ - నయనతార కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా', ‘శ్రీ రామరాజ్యం' పెద్ద హిట్ అయ్యాయి. వీరిద్దరి జోడీలో రానున్న మూడవ సినిమా ఇది.
ఆ మధ్యన బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
మరో ప్రక్క అందరూ రామ్ చరణ్ తో శ్రీవాస్ ముందుకు వెళ్తారని భావించారు. అయితే ఈ లోగా బాలకృష్ణ ఈ ఆఫర్ ఇవ్వటంతో ఇటు జంప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం విజయాలతో మినిమం గ్యారెంటీ దర్శకుడుగా అతను టాలీవుడ్ లో సెటిల్ అయినట్లే. బాలకృష్ణతో కూడా అదే మాదిరిగా హిట్ కొడితే అతనికి తిరుగు ఉండదని సినీ వర్గాలు అంటున్నాయి.