కృష్ణ వంశి షూటింగ్ లో ప్రమాదం...ఒకరు మృతి

ఇక ఈ సంఘటన జరిగిన అరగంటకే మరో ప్రమాదం ఫిల్మ్ సిటీలో చోటుచేసుకుంది. ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ -81
బ్యానర్ పై రవిబాబు దర్శకత్వంలోని చిత్రానికి సంభందించి శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో స్మాల్ టౌన్ వద్ద ఉన్న ఓ భవనంపై ఓ షూటింగ్ నడుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన షేక్ షరీఫ్(25) ఈ బృందంలో లైట్ బాయ్ గా పనిచేస్తున్నాడు. షరీఫ్ చేతిలోని లైటును హీరోయిన్ వైపు తిప్పుతూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి క్రిందపడ్డాడు. రెయిలింగ్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. ప్రాణాపాయం లో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించగా అతని కాలు,నడుము విరిగినట్లు వైద్యులు నిర్దారించారు. ప్రమాదం జరిగే చోట రక్షణ ఏర్పాట్లు సరిగా చేయాలంటూ ఫిలింసిటీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











