Don't Miss!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- News YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
టీవీ యాంకర్ మల్లిక మరణం వెనుక అసలు కారణమేమిటో తెలుసా!
తనదైన శైలిలో వ్యాఖ్యాతతో ఆకట్టుకొన్న యాంకర్, సినీ నటి మల్లిక మరణం సినీ, టెలివిజన్ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. అనారోగ్యంతో బాధపడుతూ మల్లిక సోమవారం బెంగళూరులో మరనించారు. అంత్యక్రియలు నిర్వహించేందుక
తనదైన శైలిలో వ్యాఖ్యాతతో ఆకట్టుకొన్న యాంకర్, సినీ నటి మల్లిక మరణం సినీ, టెలివిజన్ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. అనారోగ్యంతో బాధపడుతూ మల్లిక సోమవారం బెంగళూరులో మరనించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తరలించారు. ఆమె పార్దీవ దేహాన్ని సందర్శించిన కొందరు మల్లికతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని విషాదంలో మునిగిపోయారు.
కొంతకాలంగా కోమాలో..
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక 20 రోజులుగా కోమాలోనే ఉన్నట్టు బంధువులు పేర్కొన్నారు. ఆమెను మామూలు స్థితికి చేర్చడానికి డాక్టర్లు శతవిధాలుగా ప్రయత్నించారు అని వారు పేర్కొన్నారు. బ్రెయిన్ హ్యామరేజ్ కారణంగా కోమాలోకి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మంచి వ్యాఖ్యాతగా
మల్లిక అసలు పేరు అభినవ. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్గా అవార్డులను కూడా దక్కించుకొన్నారు. జెమిటీ టీవీలో ప్రసారం అవుతున్న ‘నాతిచరామి' సీరియల్లోనూ మల్లిక నటించారు.
సింగిల్ టేక్లో ఒకే..
ఎమోషనల్ సీన్స్లో నాలుగు అయిదు పేజీల డైలాగ్స్ను కూడా సింగిల్ టేక్తో చేసేవారు. మహేష్బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు' సహా పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు.
వివాహం తర్వాత నటనకు దూరం
విజయ్ సాయి వివాహం తర్వాత నటనకు దూరమయ్యారు. ఆమెకు కుమారుడు కృష్ణ ప్రసాద్ ఉన్నారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాద్లో జరిగాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు భగవంతుడిని వేడుకొన్నారు.
బాస్కెట్ బాల్ క్రీడలో
కేవలం నటనలోనే కాకుండా మల్లిక క్రీడలంటే కూడా ఇష్టం. బాస్కెట్ బాల్ క్రీడలో జాతీయస్థాయి ప్లేయర్ కూడా. నటన, యాంకరింగ్, క్రీడల్లో రాణించిన మల్లిక చిన్నవయసులోనే మరణించడంపై ఆమె సన్నిహితులు కన్నీరుమున్నీరయ్యారు.