ఆ ఛానల్తో కలిసి రమ్య నన్ను బెదిరిస్తోంది.. తగ్గేదేలే అంటున్న నరేష్!
నటుడు నరేష్ వ్యవహారం గత కొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారని వారిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నరేష్ భార్య రమ్య తెర మీదకు రావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో నరేష్ ఆమె గురించి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సీన్ లోకి ఎంట్రీ
నిజానికి పవిత్ర, నరేష్ సహజీవనం చేస్తున్నారని కొంతమంది, లేదు ఇప్పటికే పెళ్లయిపోయి సైలెంటుగా కాపురం చేసుకుంటున్నారని మరికొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఈ వ్యవహారంలో నరేష్ భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాక వారి మీద పలు ఆరోపణలు కూడా గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారం మీద నరేష్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

మూడో వివాహం
నరేష్ తొలుత డాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆమెకు దూరమయ్యారు. తరువాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను వివాహం చేసుకున్న ఆయన ఆమెతో విభేదాల కారణంగా ఆమెకు కూడా దూరమయ్యారు. తర్వాత రమ్య రఘుపతి అనే మహిళను ఆయన మూడో వివాహం చేసుకున్నారు.

విడాకుల నోటీసులు
వీరికి దాదాపు ఇరవై ఏళ్ళ వయోభేదం కూడా ఉందని చెబుతున్నారు. అయితే వివాహం చేసుకున్న రెండు సంవత్సరాలకి వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. విడాకులు తీసుకోలేదు కానీ అప్పటినుంచి దూరంగానే ఉంటున్నారు. సుమారు రెండు మూడు నెలల క్రితం రమ్య రఘుపతి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసిందంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ బంధానికి ముగింపు పలకాలని భావించిన నరేష్ ఆమెకు విడాకుల నోటీసులు పంపించినట్లు సమాచారం.

బ్లాక్ మెయిల్ చేయడానికి
తర్వాత నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ఏదో ఉందంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇది తనకు అనుకూలంగా వాడుకున్న రమ్య రఘుపతి కన్నడ మీడియా ముందుకు వెళ్లి పలు ఆరోపణలు గుప్పించారు. నరేష్ పవిత్ర లోకేష్ ఒక హోటల్లో కలిసి ఉన్న సమయంలో వారిద్దరి మీద దాడి చేసిన ఘటన కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ వ్యవహారాల మీద నరేష్ స్పందించారు. తన భార్య వెనుక ఒక ఛానల్ ఉందని ఆ ఛానల్ తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని నరేష్ అన్నారు.

లీగల్ గానే ముందుకు
ఒక వ్యవహారం మీద ఎనిమిదిన్నర గంటలపాటు లైవ్ డిబేట్ నడిపించారు అంటే అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన కామెంట్ చేశారు. తాను తన భార్య మీద కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నాను అని ఆ ఛానల్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక ఎన్ని చేసినా ఎలాంటి బ్లాక్ మెయిల్ కి తలఒగ్గేదే లేదని పేర్కొన్న ఆయన తనను నమ్ముకుని వెయ్యి మంది బతుకుతున్నారని తనకు ఏమైనా అయితే ఆ ఇన్స్టిట్యూట్ ఏమవుతుందని ప్రశ్నించారు. దానికోసం లీగల్ గానే ముందుకు వెళతానని నరేష్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











