Just In
- 15 min ago
మహేశ్కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 17 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 49 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్న్యూస్, 30,000 మందికి క్యాప్జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజశేఖర్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ‘మా’ వివాదంపై సుమన్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణలో జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఆరోజు చిరంజీవి ప్రసంగిస్తూ.. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడును చెవిలో చెబుదామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మాట్లాడుతున్న పరుచూరి గోపాల కృష్ణ నుంచి మైకు లాక్కున్న రాజశేఖర్ చిరు ప్రసంగంపై ఫైర్ అయ్యాడు. ఇష్టమొచ్చినట్టుగా రెచ్చిపోయిన రాజశేఖర్.. సభ నుంచి వెళ్లిపోవడం, సినీ పెద్దలంతా ఫైర్ అవ్వడం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సుమన్ స్పందిస్తూ ఆయన తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

తిరుమలలో సుమన్..
సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నలభై ఏళ్లు పూర్తైన సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు సుమన్. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ముచ్చటించాడు. ఆ క్రమంలో మా వివాదంపై స్పందించాడు. మా వివాదం, చిరంజీవి సూచన, రాజశేఖర్ తీరు, పెద్దల ఆగ్రహం ఇలా ప్రతీ ఒక్క విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

చిరంజీవి బాగా చెప్పాడు..
మా వివాదంపై మాట్లాడుతూ.. ‘డైరీ ఆవిష్కరణ రోజు మంచి ఉంటే మైకులో మాట్లాడదాం.. చెడుని చెవిలో చెప్పుకుందాం అని చిరంజీవిగారు బాగా చెప్పారు. `మా`లోని సమస్యలను అంతర్గతంగా చర్చించుకుని ఉండుంటే బావుండేది. కానీ సమసస్యలు పరిష్కారం కాకపోవడంతోనే రాజశేఖర్ అలా స్పందించారు. రాజశేఖర్ ‘మా'కు ఎంతో సేవ చేశారు.

తప్పు జరిగింది..
అయితే డైరీ ఆవిష్కరణ వేడుకలో రాజశేఖర్ ఆ విషయాలను చర్చించకుండా ఉండాల్సింది. తప్పు జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. మీడియా ముందు ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు మనం అంతర్గతంగా ఎలా సర్దబాటు చేసుకుంటామో.. అలాగే వ్యవహరించాలి' అని చెప్పుకొచ్చాడు.

రాజీనామా చేసిన రాజశేఖర్..
మా డైరీ ఆవిష్కరణలో జరిగిన రచ్చతో రాజశేఖర్పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని చిరంజీవి సూచించిన సంగతి తెలిసిందే. అయతే రాజశేఖరే స్వయంగా తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తనకు చిరంజీవితో ఎలాంటి గొడవలు లేవనీ, కేవలం నరేష్తో విబేధాలున్నాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.