Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శ్రీమంతుడు కాన్సెప్టు: దత్తత బాటలో నటుడు సుమన్!
హైదరాబాద్: గ్రామాలను దత్తత తీసుకోవడం, అభివృద్ధి చేయడం లాంటి కాన్సెప్టు ఎప్పటి నుండో ఉన్నప్పటికీ మహేష్ బాబు ‘శ్రీమంతుడు' తర్వాత ఇది మరింత పాపులర్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే మహేష్ బాబు, మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇలా పలువురు సినీనటులు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ లిస్టులో ప్రముఖ నటుడు సుమన్ కూడా చేరిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగమయేందుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ ముందుకుకొచ్చారు. ఈ మేరకు ఆయన మహబూబ్నగర్ జిల్లాలోని మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.
గ్రామాలను దత్తత తీసుకునేందుకు ప్రముఖులు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే టాలీవుడ్ నటులు మహేశ్బాబు, ప్రకాశ్రాజ్ ఇద్దరు మహబూబ్నగర్ జిల్లాలో చెరో గ్రామాన్ని దత్తత తీసుకున్న దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.