ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నా : ఛార్మీ సంచలనం
హైదరాబాద్ : ఛార్మి తాను పెళ్లి చేసుకుంటున్నట్లు ట్విట్టర్ సాక్షిగా ప్రకటన చేసింది. అయితే మాకు అందిన సమాచారం ప్రకారం ఈ వివాహం కేవలం జ్యోతిలక్ష్మి సినిమా కోసమే అని తెలిసింది. సరదాగా తన గురించి మాట్లాడుకునేలా చేయాలనే ఇలా తనకు వివాహం అని ఇలా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఛార్మినే మిగతా వివరాలు ఇవ్వాలి. ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందనున్న జ్యోతిలక్ష్మి చిత్రం ఆ మధ్యన జరిగి రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఫుల్ జోరుమీదున్న స్పీడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా పూర్తవటంతో తన భవిష్యత్ సినిమాల పనిలో పడిపోయాడు. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీతో కొత్త సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ తెలిపాడు. తను ఛార్మీ తో తీయబోయే సినిమా పేరు జ్యోతిలక్ష్మి అని వెల్లడించాడు. అయితే ఈ సినిమా నర్తకి జీవిత కథాంశంతో రూపొందిస్తున్నామని వెల్లడించాడు.

పేరు క్యాచీగా ఉండాలని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుందని అది ఓకే చేశామని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిలక్ష్మి నిజ జీవితానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తికాగానే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.


Click it and Unblock the Notifications











