Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హేమశ్రీ హత్య కేసులో భర్తనే నిందితుడు
నిరుడు అక్టోబర్ 9వ తేదీన హేమశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అపస్మారక స్థితిలో పడిపోయిన హేమశ్రీని ఆ రోజు భర్త సురేంద్ర బాబు ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సురేంద్ర బాబును పోలీసులు అక్టోబర్ 9వ తేదీన అరెస్టు చేశారు. ఆ తర్వాత సతీష్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్టోబర్ 8వ తేదీన హేమశ్రీతో కలిసి సురేంద్ర బాబు కారులో బెంగళూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. కారును నడపడానికి సతీష్ను వాడుకున్నాడు. అప్పటికే హేమశ్రీకి క్లోరోఫామ్ ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
అనంతపురం వచ్చిన తర్వాత ఓ ఫామ్హౌస్ వద్ద కారును ఆపించి, హేమశ్రీని లోన గదిలోకి సతీష్ సాయంతో సురేంద్ర బాబు తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోవాలని సురేంద్ర బాబు సతీష్కు చెప్పాడు.
ఈ కేసులో 70 మంది సాక్షులున్నారని, తాము సురేంద్రబాబుకు వ్యతిరేకంగా 276 పేజీల చార్జిషీట్ దాఖలు చేశామని పోలీసులు చెప్పారు. తమ వద్ద గట్టి సాక్ష్యాలున్నాయని కూడా పోలీసులు అంటున్నారు.