Don't Miss!
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
అందుకే డ్రగ్స్ ఆరోపణలు వచ్చిఉంటాయ్: పూరీ పై హీరోయిన్ పంచ్
అభిమానుల్ని బాలయ్య కొట్టడంలో తప్పు లేదన్నట్లు పూరి మాట్లాడుతున్నాడని, పూరి మీద ఘాటైన సెటైర్లు వేసింది కస్తూరి .
"రజనీ తప్ప మీకు మిగతా విషయాలు పట్టవా? ఆయన రాజకీయాగమనం గురించి మాత్రమే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? తమిళ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేవీ కనిపించడం లేదా?" అంటూ తమిళ, జాతీయ మీడియాలపై సెటైర్ వేసి రజినీ అభిమానులనుంచి పెద్ద వ్యతిరేకతనే ఎదుర్కొన్న నటి కస్తూరి ఈసారి టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని టార్గెట్ చేసుకొని మరీ పంచ్ లు విసిరింది...
నందమూరి బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టడం గురించి 'పైసా వసూల్' ఆడియో వేడుకలో పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. అది బాలయ్యకు, అభిమానులకు మధ్య లవ్ స్టోరీ అని.. దాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని కవర్ చేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. పూరి మీద ఘాటైన సెటైర్లు వేసింది.
అభిమానుల్ని బాలయ్య కొట్టడంలో తప్పు లేదన్నట్లు పూరి మాట్లాడుతున్నాడని.. దీన్ని బట్టి చూస్తే పూరి మీద డ్రగ్స్ ఆరోపణలు ఏ ఆధారాలు లేకుండా రాలేదని తెలుస్తోందన్నట్లుగా కస్తూరి వ్యాఖ్యానించడం విశేషం. బాలయ్య విషయంలో పూరి చేసిన సమర్థన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి వాస్తవమే.
ఐతే ఈ వ్యవహారంలో మన సెలబ్రెటీలెవ్వరూ కూడా పెదవి విప్పలేదు. అందరూ సైలెంటుగా ఉన్నారు. ఐతే తెలుగు సినిమాతో ఎప్పుడో కనెక్షన్ కట్ అయిపోయిన కస్తూరి.. అనూహ్యంగా దీనిపై స్పందించడం.. పూరి మీద ఇలా కౌంటర్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.