Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అందుకే డ్రగ్స్ ఆరోపణలు వచ్చిఉంటాయ్: పూరీ పై హీరోయిన్ పంచ్
అభిమానుల్ని బాలయ్య కొట్టడంలో తప్పు లేదన్నట్లు పూరి మాట్లాడుతున్నాడని, పూరి మీద ఘాటైన సెటైర్లు వేసింది కస్తూరి .
"రజనీ తప్ప మీకు మిగతా విషయాలు పట్టవా? ఆయన రాజకీయాగమనం గురించి మాత్రమే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? తమిళ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేవీ కనిపించడం లేదా?" అంటూ తమిళ, జాతీయ మీడియాలపై సెటైర్ వేసి రజినీ అభిమానులనుంచి పెద్ద వ్యతిరేకతనే ఎదుర్కొన్న నటి కస్తూరి ఈసారి టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని టార్గెట్ చేసుకొని మరీ పంచ్ లు విసిరింది...
నందమూరి బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టడం గురించి 'పైసా వసూల్' ఆడియో వేడుకలో పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. అది బాలయ్యకు, అభిమానులకు మధ్య లవ్ స్టోరీ అని.. దాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని కవర్ చేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. పూరి మీద ఘాటైన సెటైర్లు వేసింది.
అభిమానుల్ని బాలయ్య కొట్టడంలో తప్పు లేదన్నట్లు పూరి మాట్లాడుతున్నాడని.. దీన్ని బట్టి చూస్తే పూరి మీద డ్రగ్స్ ఆరోపణలు ఏ ఆధారాలు లేకుండా రాలేదని తెలుస్తోందన్నట్లుగా కస్తూరి వ్యాఖ్యానించడం విశేషం. బాలయ్య విషయంలో పూరి చేసిన సమర్థన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి వాస్తవమే.
ఐతే ఈ వ్యవహారంలో మన సెలబ్రెటీలెవ్వరూ కూడా పెదవి విప్పలేదు. అందరూ సైలెంటుగా ఉన్నారు. ఐతే తెలుగు సినిమాతో ఎప్పుడో కనెక్షన్ కట్ అయిపోయిన కస్తూరి.. అనూహ్యంగా దీనిపై స్పందించడం.. పూరి మీద ఇలా కౌంటర్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.