Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వర్షం: మోడీ పాలనపై నేహా ధుపియా విమర్శ, నెటిజన్ల ఆగ్రహం
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ పాలన పైన విమర్శలు చేసి బాలీవుడ్ బామ నేహా ధుపియా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర రాజధానిలో కురిసిన కుండపోత వర్షం వల్ల జనం అతలాకుతలం అయింది.
రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చాలా కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను కూడా వర్షం కారణంగా అసౌకర్యానికి గురయ్యానని నేహా ధుపియా ట్వీట్ చేసింది.
అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ పాలన పైన ఆమె ట్వీట్ చేసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో ముంబై తడిసిముద్దయిందని, గుడ్ గవర్నెన్స్ అంటే సెల్ఫీలు, యోగా కాదని, ప్రజలకు భద్రత పైన భరోసా ఇవ్వాలని ట్వీట్ చేసింది.
దీనిపై ఆమెకు అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందన వచ్చింది. ఎక్కువగా ఆమెకు వ్యతిరేకంగా స్పందించారు. ఆమె పబ్లిసిటీ కోసం ఇలా చేసిందని కొందరు విమర్శించారు. చేసే పనిలేక ఆమె సోషల్ మీడియాలో ఇలా విమర్శలు గుప్పిస్తోందని ఇంకొందరు అన్నారు.