Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సముద్రంలో 120 అడుగుల లోతున.. బాలీవుడ్ తార.. వారెవా క్యాబాత్ హై!
అత్యంత సాహస క్రీడ అయిన స్కూబా డైవింగ్పై పరిణితి చోప్రాకు అమితమైన ఆసక్తి ఉంది. త్వరలోనే ఆమె స్కూబా డైవర్గా కొత్త అవతారం ఎత్తనున్నది.
అందాల తార ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్లోకి ప్రవేశించించింది పరిణితి చోప్రా. లేడీస్ అండ్ రికీ బెహల్, ఇష్క్ జాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్ లాంటి ఘన విజయాలతో సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకొన్నది. ప్రస్తుతం గోల్మాల్ అగెయిన్ చిత్రం కోసం సిద్ధమవుతున్నది. త్వరలోనే ఆమె స్కూబా డైవర్గా కొత్త అవతారం ఎత్తనున్నది.
స్కూబా డైవింగ్పై పరిణితికి అమితాసక్తి
అత్యంత సాహస క్రీడ అయిన స్కూబా డైవింగ్పై పరిణితి చోప్రాకు అమితమైన ఆసక్తి ఉంది. ఇటీవల ఆమె అధికారికంగా ఈ క్రీడలో పాల్గొనేందుకు సర్టిఫికెట్ సాధించింది. దీంతో ఆమె సముద్రంలో దాదాపు 120 అడుగుల లోతున విహరించే అవకాశం ఏర్పడింది.
సముద్ర గర్భ అన్వేషణ గొప్ప అనుభూతి
‘డైవింగ్ చేయడమంటే నాకు అదోక గొప్ప అనుభూతి. సముద్ర గర్భంలో తేలికగా మారిన శరీరంతో అందమైన చేపలను, ప్రమాదకరమైన షార్క్, రంగురంగుల మొక్కలను చూడటమంటే మహా సరదా. సముద్రం అడుగున రాత్రి పూట విహరించాలని ఉంది'. రాత్రి పూట స్కూబా డైవింగ్ చేయడం కోసం అడ్వాన్స్డ్ కోర్సు చేసేందుకు పరిణితి చోప్రా సిద్ధమవుతున్నారట.
ప్రమాదకర క్రీడ కాదు.. ఆటవిడుపు
ప్రతీ ఏడాది షూటింగ్ కోసమో లేదా విడిది కోసమో చాలా దేశాలు తిరుగుతుంటాను. దాదాపు ఐదారు దేశాలకు వెళ్తుంటాను. ఓడలపై చాలా మందిని కలుసుకొంటాను. వారితో కలిసి సముద్ర గర్భంలో అన్వేషణకు వెళ్తుంటాను. నా దృష్టిలో డైవింగ్ ప్రమాదకరమైన క్రీడ కాదు. ఆటవిడుపు మాత్రమే అని పరిణితి వెల్లడించింది.
నడుము 38 నుంచి 30 వరకు
పరిణితి చోప్రా కొద్ది నెలల క్రితం విపరీతంగా బరువు పెరిగింది. ఓ దశలో 86 కిలోలకు పెరిగిపోవడంతో లావుగా కనిపించడంతో బాలీవుడ్ అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఇక కదురదనుకున్న ఆమె కఠినంగా శ్రమించి సన్నగా మారిపోయింది. పరిణితి లావు తగ్గడంపై బాలీవుడ్ ముద్దుగుమ్మలు నోరెళ్ల బెట్టారు. ఓ దశలో 38 నడుము కొలత ఉండే ఆమె 30 నంబర్కు వచ్చింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగిపోయింది.
2011లో బాలీవుడ్లోకి అడుగు
2011లో రణ్వీర్ సింగ్, అనుష్క శర్మతో కలిసి లేడీస్ వర్సెస్ రికీ బెహల్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఇష్క్ జాదే. శుద్ధ దేశీ రొమాన్స్, హసీతో ఫసీ, దావత్ ఏ ఇష్క్, కిల్ దిల్, డిష్యూం చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మేరీ ప్యారీ బిందు, గోల్మాల్ అగెయిన్ చిత్రాలకు అంగీకారం తెలిపింది.