Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐసీయూలో చేరిన నాని హీరోయిన్
బెంగళూరు : నాని హీరోగా వచ్చిన జెండాపై కపిరాజు చిత్రంలో మెరిసిన కన్నడ భామ రాగిణి ద్వివేది గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా రాగిణి ద్వివేది ఆసుపత్రి పాలు కావడం కన్నడ సినిమా రంగంలో చర్చనీయాంశమైంది.
తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఫుడ్ పాయిజతో హాస్పటిల్ చేరారని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. రాగిణి తల్లి రోహిణి మాట్లాడుతూ... అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించామని మీడియాకు వివరించారు.
రీసెంట్ గా.... రాగిణి ద్వివేదిపై జేపీ నగర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. రాగిణి ద్వివేదితో పాటు ఆమె సోదరుడుపై నిర్మాత వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే....'నాటికోలి' సినిమాలో రాగిణి ద్వివేది నటించేందుకు ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్ కు రూ.16 నుంచి రూ.17 లక్షలు చెల్లించానని, సినిమా చిత్రీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో డబ్బు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా స్పందన లేదని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
డబ్బు తిరిగి ఇచ్చేది లేదని, అవసరమైతే మరో సినిమాలో నటిస్తానని రాగిణి చెప్పడంతో పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు నిర్మాత తెలిపాడు. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.