Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అమీర్ఖాన్ను ఏడిపించిన రేఖ.. పార్టీలో అసలేం జరిగింది..
దంగల్ చిత్ర ఘన విజయాన్ని పురస్కరించుకొని బాలీవుడ్ ప్రముఖులకు భారీ విందును ఏర్పాటు చేశాడు అమీర్ ఖాన్. ఈ సందర్భంగా ప్రముఖ నటి రేఖ తనకు రాసి ఇచ్చిన లేఖను చూసి అమీర్ ఖాన్ కంట్లో నీళ్లు తిరిగాయట.
మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నిర్మించి, నటించిన దంగల్ చిత్రం భారత సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసింది. దంగల్ చిత్ర ఘన విజయాన్ని పురస్కరించుకొని బాలీవుడ్ ప్రముఖులకు భారీ విందును ఏర్పాటు చేశాడు అమీర్ ఖాన్. ఈ సందర్భంగా ప్రముఖ నటి రేఖ తనకు రాసి ఇచ్చిన లేఖను చూసి అమీర్ ఖాన్ కంట్లో నీళ్లు తిరిగాయట.
రేఖ లేఖను జీవితాంతం దాచుకొంటా..
దంగల్ చిత్రాన్ని చూసిన రేఖ తన స్పందనను లేఖ రూపంలో అమీర్ ఖాన్ కు బహుమతిగా ఇచ్చింది. ఆ లేఖను చదివిన అమీర్ భావోద్వేగానికి గురయ్యాడట. ఆ తర్వాత కన్నీటిపర్యంతమయ్యాడట. తన హృదయాన్ని గెలుచుకొన్న లేఖను జీవితాంతం తన వెంట ఉంచుకొంటానని అమీర్ తన సన్నిహితులతో చెప్పినట్టు మీడియా ఓ కథనాన్ని వెల్లడించింది.
దంగల్పై ప్రత్యేకతను చాటడానికే..
ఎన్నడూ పార్టీలకు హాజరుకాని రేఖ.. దంగల్ చిత్రానికి ఉన్న ప్రత్యేకతను చెప్పడానికే ఆ పార్టీకి హాజరైందట. అమీర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రాన్ని చూసి చలించిపోయిందట. కథ, కథనం, నటీనటుల ప్రతిభ రేఖను అమితంగా ఆకట్టుకున్నాయట. దాంతో ఆ చిత్రంలోని అమీర్ నటనను, కళాకారుల ప్రతిభను కొనియాడుతూ లేఖ రాసి ఇచ్చినట్టు సమాచారం.
దంగల్ పార్టీకి సీనియర్ నటులు
దంగల్ సక్సెస్ పురస్కరించుకొని అమీర్ ఖాన్ బాలీవుడ్ ప్రముఖులకు భారీ విందును ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి సీనియర్ నటులు జితేంద్ర, రేఖ, రణ్బీర్ కపూర్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీర్కు రేఖ లేఖను అందించింది.
అద్భుత కథకు ప్రముఖుల ప్రశంస
అద్భుతమైన కథతో తెరకెక్కించిన దంగల్పై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల కాలంలో పలు అవార్డులను గెలుచుకొన్నది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, విమర్శకుల పొగడ్తలను అందుకున్నది. విడుదలైన ప్రతీ చోట భారీ రికార్డు కలెక్షన్లను రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.743 కోట్లు
గతేడాది డిసెంబర్లో విడుదలైన దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.743 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దేశవ్యాప్తంగా రూ.541 గ్రాస్ (రూ.369 కోట్లు), ఓవర్సీస్లో రూ. 202 కోట్లు వసూలు చేసింది. యూటీవీ, అమీర్ ఖాన్ ప్రొడక్షన్ పై రూపొందిన దంగల్లో అమీర్ తోపాటు సాక్షి తన్వర్, సన్య మల్హోత్రాలు ప్రధాన పాత్రలు పోషించారు.